వైసీపీలో కీలక నేత రాజ్యసభ సభ్యుడు అయిన విజయసాయిరెడ్డి నెల్లూరు నుంచి లోక్ సభకు పోటీ చేస్తారు. ఈ మేరకు వైసీపీ శుక్రవారం నాడు రాత్రి రిలీజ్ చేసిన 9 వ జాబితాలో ఆయన పేరు కనిపించింది.ఇది ఊహించని ఎంపిక అని అంటున్నారు. ఇక వైసీపీ నుంచి ఎంపీ అభ్యర్ధిగా విజయసాయిరెడ్డి పోటీ అంటే నెల్లూరు రాజకీయంలో వైసీపీ అల్టిమేట్ పావులనే కదిపింది అనుకోవాలి.ఇప్పటి వరకు వినిపించిన పేరు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి. ఆయన కూడా రాజ్యసభ సభ్యుడే. ఆయన రాజ్యసభ సభ్యత్వం ఈ సంవత్సరం ఏప్రిల్ 2 తో పూర్తి కావస్తోంది. ఆయన తన భార్య ప్రశాంతిరెడ్డికి అసెంబ్లీ టికెట్ ఇవ్వలేదని పార్టీకి దూరం అయ్యారు. ఆయన టీడీపీ తరఫున నెల్లూరు ఎంపీగా పోటీ చేస్తారని సమాచారం తెలుస్తోంది. ఈ నేపధ్యంలో వేమిరెడ్డికి పోటీగా ఎవరిని నిలపాలని వైసీపీ ఎన్నో చర్చలు జరిపిన మీదట విజయసాయిరెడ్డి అల్లుడు అన్న శరత్ చంద్రారెడ్డి పేరు తెర మీదకు వచ్చింది.ఆయనే ఇక అభ్యర్థి అని అంతా అనుకుంటున్న నేపధ్యంలో ఏమైందో ఏమో సడెన్ గా విజయసాయిరెడ్డి పేరుని వైసీపీ అధినాయకత్వంలో బాగా వినిపిస్తుంది. ఆయనకు కన్ఫర్మ్ చేసేసింది. రాజకీయ వ్యూహ నిపుణుడిగా విజయసాయిరెడ్డి మంచి పేరు తెచ్చుకున్నారు.


ఆయన సేవలను పార్టీ ఈ ఎన్నికల్లో కొన్ని రీజియన్స్ లో ఉపయోగించుకుంటుందని అంతా భావించారు.అందుకే ఆయనకు గుంటూరు పల్నాడు జిల్లాల బాధ్యతలను అప్పగించారు. అయితే ఇపుడు ఆయన్నే ప్రత్యక్ష ఎన్నికలకు రెడీ చేస్తున్నారు. అందుకే విజయసాయిరెడ్డి నెల్లూరు ఎంపీగా తన నిన్నటి సహచరుడు వేమిరెడ్డిని ఢీ కొట్టబోతున్నారు. నెల్లూరులో  వైసీపీకి కొంచెం రాజకీయంగా ఇబ్బందులు ఉన్నాయి. వరసబెట్టి కీలక నేతలు అంతా కూడా పార్టీని వీడుతున్నారు. అదే టైం లో పార్టీకి గతంలో కంటే ఇప్పుడు కొంత ఎదురీత తప్పదని అంటున్నారు.ఇలాంటి నేపధ్యంలో నెల్లూరు ఎంపీ ఎవరు అన్నదే ఆసక్తికరంగా చూశారు. ఎంపీ అభ్యర్ధి సరైన వారిని పెడితే కచ్చితంగా అసెంబ్లీ పరిధిలో కూడా గెలుపు కన్ఫర్మ్ అని అంతా లెక్క కట్టారు. దాంతోనే విజయసాయిరెడ్డి వంటి వ్యూహకర్తను వైసీపీ దించుతోందని అంటున్నారు. ఇక విజయసాయిరెడ్డి నెల్లూరు వాసి కావడం కూడా ప్లస్ పాయింట్. దాంతో వైసీపీ ఆయనను ప్రత్యక్ష రాజకీయాల్లోకి దింపుతోంది. వైసీపీలో పది సంవత్సరాల క్రితమే విజయసాయిరెడ్డి నెల్లూరు ఎంపీగా పోటీ చేస్తారని ప్రచారం జరిగింది. అదిప్పుడు నిజం కాబోతోంది. మరి వేమిరెడ్డి  విజయసాయిరెడ్డిలో ఎవరు గెలుస్తారనేది ఆసక్తిని రేపుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: