విశాఖ పార్లమెంట్ సీటులో రాజకీయంగా బాగా అనుభవం కలిగిన మాజీ ఎంపీ వైసీపీ నుంచి పోటీ చేస్తున్నారు. ఏకంగా రెండు సార్లు ఎంపీగా పనిచేసిన బొత్స ఝాన్సీ లక్ష్మి ఈసారి పోటీకి దిగుతున్నారు. ఆమె పక్కా లోకల్ కార్డు తో పాటు బీసీ మహిళ అనే మరో  కార్డు తో  రంగంలో ఉన్నారు.తాజాగా దానికి మరో కార్డు ని వైసీపీ యాడ్ చేసింది. అదే ఆమెకున్న రాజకీయ అనుభవం.రెండు సార్లు ఎంపీగా ఆమె పనితనం.ఆమె గతంలో బొబ్బిలి ఇంకా విజయనగరం నుంచి ఎంపీగా పనిచేసినపుడు విశాఖ సమస్యలను కూడా పార్లమెంట్ లో ప్రస్తావించానని ప్రచారంలో చెబుతున్నారు. అలాగే విశాఖ అభివృద్ధి పట్ల తనకు ఒక విజన్ ఉందని ఆమె అంటున్నారు  ఈ సారి విశాఖ ఎంపీగా గెలిస్తే తాను అయిదేళ్లలో విశాఖ సిటీని ఎంతో అద్భుతంగా అభివృద్ధి చేస్తానని చెబుతున్నారు.తన రాజకీయ అనుభవంతో పాటు తన విద్యార్హతలను కూడా ఆమె ప్రస్తావిస్తున్నారు. డబుల్ పీహెచ్ డీ చేసిన బొత్స ఝాన్సీ లక్ష్మి తాను పుట్టిన విశాఖ తనకే ఓటు వేస్తుందని ఎంతో బలంగా నమ్ముతున్నారు. తనకంటే విశాఖ సమస్యల గురించి ఎవరికీ తెలుసని ఆమె ప్రశ్నిస్తున్నారు.


వైసీపీ నేతలు గట్టి నమ్మకంతో మహిళా ఎంపీని ఈసారి ఎంపీగా పార్లమెంట్ కి పంపించాలని కోరుతున్నారు. వలసవాదులకు ఈసారి చెక్ పెట్టాలని వారు కోరుతున్నారు.అలాగే మన విశాఖ మన ఎంపీ అంటూ కొత్త నినాదం ఇస్తున్నారు. ఇవన్నీ వైసీపీ ఆయుధాలుగా ఉంటే టీడీపీ కూటమి నుంచి పోటీలో ఉన్న బాలకృష్ణ చిన్నలుడు శ్రీ భరత్ తాను కూడా విశాఖ వాసినే అని అంటున్నారు. తాను విశాఖలో విద్యా సంస్థలు పెట్టి అభివృద్ధి చేశానని చెబుతున్నారు. తాను యువ నాయకత్వం అందిస్తానని అంటున్నారు. విశాఖ పార్లమెంట్ పరిధిలో సమస్యల మీద తనకు పూర్తిగా అవగాహన కూడా ఉందని అంటున్నారు.ఇక్కడ పోటీ ముఖ్యంగా వైసీపీ టీడీపీ కూటమి మధ్యన ఉంది. అనుభవం వర్సెస్ కొత్త తరంగా ఈ పోరు తీవ్రంగా మారుతోంది. ఇంకా అలాగే బీసీ వర్సెస్ ఓసీ అని కూడా అంటున్నారు. అనుభవ రాజకీయంతో వర్ధమాన రాజకీయం పోరుగా పేర్కొంటున్నారు. మహిళకు ఈసారి చాన్స్ ఇవ్వాలని వైసీపీ అంటూంటే యువతరానికి చాన్స్ ఇవ్వాలని అంటోంది టీడీపీ కూటమి. ప్రజలు ఎవరి వైపు ఉంటారు. ఇక ఏ తీర్పు ఇస్తారు అనేది చూడాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: