గత పదేళ్ల హయాంలో ప్రధానిగా మోడీ కేవలం అభివృద్ధిపైనే దృష్టి సారించారు. భారత్ను అభివృద్ధి చెందుతున్న దేశాల జాబితా నుంచి అభివృద్ధి చెందిన దేశాల సరసన చేర్చాలనేది తన లక్ష్యమని ఆయన పలుమార్లు స్పష్టం చేశారు. ఈ క్రమంలో భారత ఆర్థిక వ్యవస్థ ప్రస్తుతం ప్రపంచంలోని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో ఐదో స్థానానికి చేర్చారు. త్వరలో మూడో స్థానానికి భారత్ చేరడం ఖాయమని ఆయన పేర్కొంటున్నారు. అయితే దేశాభివృద్ధికి ఉచితాలు విఘాతమనే భావనలో బీజేపీ ఉంది. ఆ పార్టీ విధానాలు సైతం కేవలం దేశాభివృద్ధి వైపు ఎక్కువగా ఉన్నాయి. సంక్షేమానికి తగిన ప్రాధాన్యత ఇస్తూనే అభివృద్ధిపై బీజేపీ దృష్టి పెట్టింది. దీంతో 2047 నాటికి ప్రపంచంలోనే భారత్ను అగ్రస్థానంలో నిలబెట్టాలని బీజేపీ కృతనిశ్చయంతో కనిపిస్తోంది. ఈ తరుణంలో ఏపీలో ఆ పార్టీ ఎలాంటి విధానాలు అవలంబించనుందో రాజకీయ విశ్లేషకులకు అంతుపట్టడం లేదు. ఆ పార్టీ ప్రస్తుతం టీడీపీ, జనసేనతో కలిసి ఏపీలో ఎన్నికల బరిలోకి దిగుతోంది. ఈ సమయంలో కూటమిలోని జనసేన, బీజేపీకి సమాచారం ఉందో లేదో తెలియదు కానీ, టీడీపీ అధినేత చంద్రబాబు మాత్రం ప్రజలకు పెద్ద ఎత్తున హామీలు ఇస్తున్నారు. రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అమలు చేయాలంటే కేంద్ర ప్రభుత్వం నుంచి సహకారం అవసరం. అయితే ఉచితాల పట్ల విముఖత చూపే బీజేపీ తమ మిత్రపక్షం టీడీపీకి ఎక్కడా అడ్డు చెప్పడం లేదు. అలా అని ఆ పార్టీని సమర్ధించడం కూడా లేదు. మినీ మేనిఫెస్టో పేరుతో సూపర్ సిక్స్ హామీలను ఆయన ఇప్పటికే ఇచ్చేశారు. పూర్తి స్థాయి మేనిఫెస్టోను త్వరలో ప్రకటించనున్నారు. వీటి విషయంలో బీజేపీ ఎలా స్పందిస్తుందోనని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
గత పదేళ్ల హయాంలో ప్రధానిగా మోడీ కేవలం అభివృద్ధిపైనే దృష్టి సారించారు. భారత్ను అభివృద్ధి చెందుతున్న దేశాల జాబితా నుంచి అభివృద్ధి చెందిన దేశాల సరసన చేర్చాలనేది తన లక్ష్యమని ఆయన పలుమార్లు స్పష్టం చేశారు. ఈ క్రమంలో భారత ఆర్థిక వ్యవస్థ ప్రస్తుతం ప్రపంచంలోని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో ఐదో స్థానానికి చేర్చారు. త్వరలో మూడో స్థానానికి భారత్ చేరడం ఖాయమని ఆయన పేర్కొంటున్నారు. అయితే దేశాభివృద్ధికి ఉచితాలు విఘాతమనే భావనలో బీజేపీ ఉంది. ఆ పార్టీ విధానాలు సైతం కేవలం దేశాభివృద్ధి వైపు ఎక్కువగా ఉన్నాయి. సంక్షేమానికి తగిన ప్రాధాన్యత ఇస్తూనే అభివృద్ధిపై బీజేపీ దృష్టి పెట్టింది. దీంతో 2047 నాటికి ప్రపంచంలోనే భారత్ను అగ్రస్థానంలో నిలబెట్టాలని బీజేపీ కృతనిశ్చయంతో కనిపిస్తోంది. ఈ తరుణంలో ఏపీలో ఆ పార్టీ ఎలాంటి విధానాలు అవలంబించనుందో రాజకీయ విశ్లేషకులకు అంతుపట్టడం లేదు. ఆ పార్టీ ప్రస్తుతం టీడీపీ, జనసేనతో కలిసి ఏపీలో ఎన్నికల బరిలోకి దిగుతోంది. ఈ సమయంలో కూటమిలోని జనసేన, బీజేపీకి సమాచారం ఉందో లేదో తెలియదు కానీ, టీడీపీ అధినేత చంద్రబాబు మాత్రం ప్రజలకు పెద్ద ఎత్తున హామీలు ఇస్తున్నారు. రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అమలు చేయాలంటే కేంద్ర ప్రభుత్వం నుంచి సహకారం అవసరం. అయితే ఉచితాల పట్ల విముఖత చూపే బీజేపీ తమ మిత్రపక్షం టీడీపీకి ఎక్కడా అడ్డు చెప్పడం లేదు. అలా అని ఆ పార్టీని సమర్ధించడం కూడా లేదు. మినీ మేనిఫెస్టో పేరుతో సూపర్ సిక్స్ హామీలను ఆయన ఇప్పటికే ఇచ్చేశారు. పూర్తి స్థాయి మేనిఫెస్టోను త్వరలో ప్రకటించనున్నారు. వీటి విషయంలో బీజేపీ ఎలా స్పందిస్తుందోనని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.