బలబలాలు:
2014, 2019లో అధికారంలోకి వచ్చిన వైసిపి ఆధ్వర్యంలో ఈ నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని బలమైన అంశం ప్రజల్లోకి వచ్చింది. ముఖ్యంగా పామర్రులో బస్టాండ్, డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉందని ప్రజలు అగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా ఇసుక ప్రజలకు అందుబాటులో లేకుండా ధరలు పెరిగాయని ఆరోపణ ఉంది. మరోవైపు జగన్ పథకాలు ఎక్కువగా నియోజకవర్గానికి అందాయి. పథకాల గురించి వివరిస్తూ మరోసారి కైలా అనిల్ ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఇక టిడిపి నుంచి పోటీ చేసే కుమార రాజా ప్రస్తుతం అక్కడ టిడిపి ఇన్చార్జిగా ఉన్నారు. దీంతో అధిష్టానం ఆయనకి టికెట్ ఇచ్చింది. ఇప్పటికే చాలాసార్లు ఓటమిపాలైన టిడిపికి ఈసారి చాన్స్ ఇద్దామనే ఆలోచన ప్రజల్లో బలంగా ఉన్నట్టు తెలుస్తోంది. అంతేకాకుండా వైసిపి చేసినటువంటి వైఫల్యాలను కూడా వర్ల కుమార రాజా బయట పెడుతూ దూసుకుపోతున్నారు. కానీ వర్లకు కల్పన సపోర్టు దొరికితే మాత్రం విజయ తీరాలకు వెళ్లి అవకాశం ఉందని తెలుస్తోంది. మరి చూడాలి పామర్రు ప్రజలు ఈసారి మార్పు కోరుకుంటారా లేదంటే మరోసారి వైసీపీకే అధికారం కట్టబెడతారా అనేది ఎన్నికల తర్వాత తెలుస్తుంది.