ఆంధ్రప్రదేశ్ టీడీపీ అధ్యక్షుడు అయినా అచ్చెన్నాయుడుకు ఎన్నికల వేళ అన్నీ కలిసిస్తున్నాయా అంటే అవుననే చెప్పాలి. దానికి ఉదాహరణగా ఆయన ప్రత్యర్థి  అయినా దువ్వాడ శ్రీనివాస్ అతని భార్య చేతిలోనే ప్రతి విషయంలో పదే పదే ఓడిపోతున్నారు. తాజాగా మరోసారి ఆయన భార్య రంగంలోకి దిగారు. వచ్చే ఎన్నికల్లో తాను ఇండిపెండెంట్ గా పోటీ చేస్తున్నట్లుగా ప్రకటించారు. వైసీపీ బీఫాం అనేది తనకే వస్తుందని లేకపోతే  స్వతంత్రంగా బరిలోకి ఉంటానని ఆమె అంటున్నారు. వైసీపీ అధిష్టానం దువ్వాడ శ్రీనివాస్ ను మొదట టెక్కలి ఇంచార్జ్ గా పెట్టారు. ఆయన అక్కడ అనధికారిక ఎమ్మెల్యేగా కూడా వ్యవహరించారు. అయితే ఈ క్రమంలో ఆయన అక్కడ ఓ మహిళకు పనులు చేసి పెట్టి ఆమెతో వివాహేతర బంధం పెట్టుకున్నారు.దాంతో ఇంట్లో రచ్చ జరగడంతో జడ్పీటీసీ అయిన దువ్వాడ శ్రీనివాస్ భార్య వాణి ఈ విషయాన్ని హైకమాండ్ దృష్టికి తీసుకెళ్లారు. వైసీపీ అధిష్టాననికి తనకు ఇంచార్జ్ టిక్కెట్ ఇస్తే సరే లేకపోతే రచ్చ చేస్తామని హెచ్చరించారు. చివరికి ఇది వారి కుటుంబ సమస్య కాబట్టి దువ్వాడ అంగీకారంతోనే వాణిని ఇంచార్జ్ గా నియమించారు. కానీ అభ్యర్ధులను ప్రకటించే ముందు మళ్లీ సీన్ మొదటికే వచ్చే మార్చేశారు. దువ్వాడ శ్రీనివాస్ కే అభ్యర్థిత్వం ఇచ్చారు. దీంతో దువ్వాడ శ్రీవాణి వైసీపీ అధిష్టానం పై మరింత  ఫైర్ అవుతున్నారు. ప్రత్యేకంగా క్యాడర్ ను కూడా మెయిన్ టెయిన్ చేస్తున్నార. అలాగే ఒకవైపు నామినేషన్ కు సిద్ధమయ్యారు. మరో వైపు కాంగ్రెస్ పార్టీ నుంచి కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి పోటీ చేస్తూండటంతో కాళింగ ఓట్లు చీలిపోతాయని  కంగారులో ఉంటే ఇప్పుడు భార్యే భర్తకు రెబల్ గా పోటీ ఇచ్చి సిద్ధపడటం దువ్వాడ శ్రీనివాస్ కు చాలా ఇబ్బందికరంగా మారింది. కుటుంబాన్ని చక్కదిద్దుకోలేని ఆయన నియోజకవర్గంలో ఎలా గెలుస్తాడన్న సెటైర్లు కూడా వినిపిస్తున్నాయి.దీన్ని బట్టి చూస్తుంటే వైసీపీ అలాగే కాంగ్రెస్ ఉన్న సొంత పోరు టీడీపీ కి బాగా కలిసిచ్చేలాగా ఉందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఈసారి కూడా అచ్చేన్నాయుడి గెలుపు ఖాయం అని తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: