నందమూరి బాలక్రిష్ణ చిన్నల్లుడు శ్రీ భరత్ కి అటు రాజకీయంగా ఇటు సినీ రంగం పరంగా కూడా పలుకుబడి ఉంది. విశాఖ నుంచి రెండు సార్లు ఎంపీ అయిన ఎంవీవీఎస్ మూర్తి మనవడిగా వారసుడిగా శ్రీభరత్ 2019 వ సంవత్సరంలో మొదటి సారి ఎంపీ బరిలోకి దిగారు.ఆనాడు ఆయనకు అన్నీ కలసి వచ్చినా జనసేన ఓట్లు భారీగా చీల్చడంతో ఛాన్స్ తప్పిపోయింది. జనసేన పార్టీ నుంచి జేడీ లక్ష్మీనారాయణ ఒక బలమైన సామాజిక వర్గానికి చెందిన వారు కావడంతో ఓట్ల చీలిక జరిగింది. ప్రస్తుతం వైసీపీ అన్నీ చూసుకుని ఏకంగా అదే సామాజిక వర్గానికి చెందిన బొత్స ఝాన్సీకి ఎంపీ టికెట్ ఇచ్చింది. ఆమె విశాఖ వాసి, మంచి విద్యాధికురాలు కూడా. 2 సార్లు ఎంపీగా పనిచేసిన అనుభవం ఉన్న వారు. వీరు కాపు సామాజిక వర్గానికి చెందిన వారు. పైగా ఈమె మహిళ. ఇలా ఎన్నో సమీకరణలు ఆమెకు కలసి వస్తున్నాయి. దాదాపుగా నలభై సంవత్సరాల నుంచి విశాఖ ఎంపీ సీఎటు స్థానికేతరులకు పోతోంది. ఎక్కడి నుంచో వచ్చిన వారికే ఈ సీటుని ఇస్తున్నారు. వాళ్ల గెలుస్తున్నారు.ఆ అసంతృప్తి అనేది అక్కడి జనాలలో  ఉంది. అది వైసీపీ పట్టుకుని తన నిర్ణయాన్ని ఇలా చేసింది. అదే విధంగా బలమైన కాపు సామాజిక వర్గం నుంచి కూడా ప్రధాన పార్టీల నుంచి గతంలో పోటీ చేసిన దాఖలాలనేవి లేవు. అలాగే గెలిచింది కూడా లేదు. దాదాపుగా నాలుగున్నర దశాబ్దాల క్రితం కొమ్మూరు అప్పలస్వామి విశాఖకి ఎంపీ అయ్యారు. ఆయన 1980 వ సంవత్సరంలో ఎంపీగా కాంగ్రెస్ తరఫున గెలిచారు.


పైగా ఆయన కాపు సామాజిక వర్గానికి చెందిన నేత.ఆ తరువాత మళ్లీ గెలిచింది లేదు. ఇక ఇది కూడా వైసీపీకి అడ్వాంటేజ్ అని అంటున్నారు. ఇంకా దాంతో పాటు బీసీలు ఎస్సీస్ ఎస్టీలతో పాటు మైనారిటీలు కూడా విశాఖ ఎంపీ సీటు పరిధిలో ఉన్నారు. అందువల్ల వైసీపీకి ఇవి సోషల్ ఇంజనీరింగ్ రూపంలో కలసివస్తున్నాయని అంటున్నారు.ఇక్కడే టీడీపీ ఎంపికను తప్పుపడుతున్న సామాజిక వర్గాల వారు కూడా ఉన్నారు. మూర్తి బతికి ఉండగా ఆయనకే విశాఖ ఎంపీ టికెట్ ఇస్తూ వచ్చిన టీడీపీ ఇప్పుడు ఆయన మనవడికి ఇచ్చిందని, విశాఖలో అతి తక్కువగా ఉన్న కమ్మ సామాజిక వర్గానికే టికెట్ ఇవ్వడం ద్వారా బలమైన సామాజిక వర్గాల ఆకాంక్షను అర్ధం చేసుకోవడం లేదని తెలుస్తుంది. ఇంకా అంతే కాకుండా లోకల్ గా ఉన్న వారికి భూమిపుత్రులకు ఉత్తరాంధ్రా వాసులకు ఎందుకు టికెట్లు ఇవ్వరని కూడా ప్రశ్నలు వస్తున్నాయి.విశాఖ సిటీలో నాలుగు అసెంబ్లీ సీట్లల్లో కనీసం రెండు సీట్లు వైసీపీ ఖాతాలోకి వెళ్ళే అవకాశాలు కనిపిస్తున్నాయి. 2019లో 4 సీట్లూ టీడీపీకి దక్కవని అంటున్నారు. గాజువాక భీమిలీ ఇంకా విశాఖ తూర్పులలో హోరా హోరీ పోరు ఉందని ఎస్ కోటలో వైసీపీ మెజారిటీ సాధిస్తుందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. ఈ లెక్కన వైసీపీ విశాఖ ఎంపీ సీటు గెలుచుకోవడం ఖాయమని అంటున్నారు.మరో వైపు చూస్తే రాజకీయంగా అనుభవం పరంగా బొత్స ఝాన్సీతో శ్రీ భరత్ ధీటైన అభ్యర్ధిగా తలపడగలరా అన్న చర్చ సాగుతోంది.మరి చూడాలి ఏమవుతుందో..

మరింత సమాచారం తెలుసుకోండి: