రాబోతున్న ఏపీ అసెంబ్లీ ఎన్నికల కోసం ఇప్పటికే చాలామంది నేతలు నామినేషన్లు వేయడమే కాకుండా తమ గెలుపు కోసం ప్రచారం కూడా మొదలుపెట్టారు. తాజాగా ఏపీ సీఎం సమర్పించిన అఫీడవిట్ ప్రకారం జగన్మోహన్ రెడ్డి ఆస్తి 2019 నుంచి20 24 వరకు 41% పెరిగినట్లుగా తెలుస్తోంది. వాటి గురించి పూర్తిగా తెలుసుకుందాం.


ఆంధ్రప్రదేశ్లోని కడప జిల్లా అంటే వైయస్ కుటుంబానికి పెట్టింది పేరు.. పులివెందుల నియోజకవర్గం నుంచి ఏపీ సీఎం జగన్ పోటీ చేయబోతున్నారు. అఫిడవిట్లో తెలిపిన విధంగా సీఎం జగన్ ఆస్తులు విషయానికి వస్తే.. 2019లో రూ.397 కోట్ల రూపాయలు ఉన్నాయని 2024 వచ్చేసరికి రూ.529.87 కోట్ల రూపాయలకు పెరిగిందని తెలుస్తోంది. ముఖ్యంగా జగన్ మోహన్ రెడ్డి భార్య వైయస్ భారతి రెడ్డి గారి ఆస్తి ఐదేళ్లలో రూ.124 కోట్ల రూపాయల నుంచి రూ.170 కోట్ల రూపాయలకు పెరిగినట్టు తెలియజేశారు. ఇక వీరి కుమార్తెల ఆస్తి రూ.779 కోట రూపాయలు ఉన్నట్లు అఫీడవిట్లో తెలియజేశారు.


సీఎం జగన్ ఆస్తినీ ఎక్కువగా ఫిక్స్డ్ డిపాజిట్లు, బీమా లలో ఉన్నాయి.. అలాగే వైయస్ షర్మిలాకు కూడా 82 కోట్లు రుణం ఇచ్చారని ఆమె ఇటీవలే తెలియజేసింది.

చరాస్తులు (ఫిక్స్డ్ డిపాజిట్స్, బీమా, నగదు, రుణాలు)

1). వైయస్ జగన్-483,08,35,064
2). వైయస్ భారతి రెడ్డి-119,38,07,193..


సీఎం జగన్ ఆస్తి విలువ..483,08,35,064
భారతి రెడ్డి చరాస్తుల విలువ ఐదు కోట్ల విలువైన నగలు..119,38,07,193 ..
జగన్, భారతి రెడ్డి కలిసి రూ.602.46 కోట్ల రూపాయలు కలిగి ఉన్నారట. అలాగే జగన్ దగ్గర ఒక బుల్లెట్ ప్రూఫ్ స్కార్పియో కూడా కలిగి ఉన్నారు.

స్థిర ఆస్తులు (వ్యవసాయ ఆస్తులు వాణిజ్య)

1). జగన్- రూ.46,78,89,930
2). భారతి- రూ.56,92,19,84
మొత్తం ఇద్దరు రూ.103.71 కోట్లు కలిగి ఉన్నారు.

అప్పుల విషయానికి వస్తే.
1). జగన్ రూ.1.10 కోట్లు
2). భారతి రూ.7.41 కోట్లు.


క్రిమినల్ కేసుల విషయానికి వస్తే 26 ఉన్నాయి.. మనీలాండరింగ్, పరువు నష్టం ,బెదిరింపు ,ఎన్నికలకు సంబంధించి తదితర కేసులు ఉన్నాయి.


ఎన్నికల అఫిడవిట్ లో తెలిపిన  ప్రకారం జగన్ ఆయన భార్య భారతి రెడ్డి ఇద్దరు కుమార్తెలు వైయస్ హర్షిని రెడ్డి, వైయస్ వర్షా రెడ్డిలకు కోట్లలో పెట్టుబడులు ఉన్నట్లుగా తెలియజేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: