నిన్న ఆంధ్రప్రదేశ్ లో పోలింగ్ చాలా రసవత్తరంగా ముగిసింది. చాలా చోట్ల గొడవలు కూడా అయ్యాయి. అందుకు సంబంధించిన వీడియోలు కొన్ని బాగా వైరల్ కూడా అయ్యాయి. తమ నాయకుడిని ఎన్నుకోవడం కోసం పోలింగ్ బూతులకు ఓటర్లు  భారీగా  వచ్చారు. నిన్న పోలింగ్ సమయం అయిపోయినా కూడా ఓటర్లు క్యూ లైన్ లో ఉండటం తో అర్ధరాత్రి దాకా పోలింగ్ జరిగింది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో పోలింగ్ శాతం ఎక్కువగా జరిగింది. అందులోనూ మహిళా ఓటర్లు భారీ గా తరలి వచ్చి ఓటు వేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో ఎన్నడూ లేని విధంగా భారీగా పోలింగ్ శాతం అనేది పెరిగింది. మహిళా ఓటర్లు వృద్దులు ఏమాత్రం సైతం ఏమాత్రం తగ్గకుండా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.. ఈ ఐదేళ్ల పాలన లో బడుగు బలహీన వర్గాలకు ఎంతగానో న్యాయం చేసిన జగన్ మోహన్ రెడ్డిని మరోసారి సీఎంగా చూడాలని మళ్ళీ ఆయన్ని గెలిపించుకునేందుకు ఓటర్లు పోటెత్తారు. ప్రజలలో వైసీపీకి భారీ స్పందన చూసి టీడీపీ శ్రేణులు తట్టుకోలేక చివరికి దాడికి చేసిన ఘటనలు వెలుగులోకి వచ్చాయి.


తాజాగా జరిగిన ఎన్నికల సర్వే లో కూడా వైసీపీ తిరుగులేని విజయం సాధిస్తుందని పలు రాజకీయ విశ్లేషకులు తెలిపారు. దీనితో టీడీపీ శ్రేణులు చాలా నిరాశకు గురవుతున్నారు.సోషల్ మీడియా లో కూడా టీడీపీ శ్రేణులు వరుస గా పోస్టులు పెడుతూ ఈ సారి కూటమి విజయం సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు కానీ వారికి వరుసగా షాకులు మీద షాకులు మాత్రం తప్పట్లేదు.ఒంటరి పోరాటం చేస్తూ యోధుడిలా దూసుకుపోతున్న జగన్ మోహన్ రెడ్డిని జనాలకు దూరం చేసి ఎలాగైనా ఓడించాలని పవన్, బాబు చాలా కష్టపడ్డారు. నిన్న పోల్ అయిన ఓట్ల విషయానికి వస్తే జగన్ వన్ మ్యాన్ షోతో టీడీపీ కూటమికి డర్టీ పిక్చర్ కనపడింది.ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంతటా వైసీపీకి ఎక్కువ ఓట్లు పోల్ అయినట్లు ఓటర్ల నుంచి ఇండియా హెరాల్డ్ కి సమాచారం తెలుస్తుంది. ఎక్కడ చూసినా కూడా ఫ్యాన్ గాలి వీస్తుంది. ఉత్తరాంధ్ర, రాయల సీమ.. ఇలా ఎటు చూసినా కూడా వైసీపీ ఫ్యాన్ గాలి సైకిల్ ని పడేసి గాజు గ్లాసుని పగలగొట్టిసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: