![](https://www.indiaherald.com/cdn-cgi/image/width=750/imagestore/images/politics/politics_analysis/buvanagiri-bura-narsayya-goud-mallesh-kiran-kumar-cong-bjp-brs21a9a14b-1f15-4669-bef6-4acc4547b6c8-415x250.jpg)
• భువనగిరి సెంటిమెంట్ నర్సయ్యకు కలిసి వస్తుందా..
• 'బీసీ' నినాదం పనిచేసేనా..
• కాంగ్రెస్ కంచుకోటలో గెలిచేదెవరు..?
తెలంగాణ రాష్ట్రంలోని అత్యంత కీలకమైన పార్లమెంటు స్థానాలలో భువనగిరి కూడా ఒకటి. ప్రస్తుతం కాంగ్రెస్ కంచుకోట అయిన ఈ ప్రాంతంలో ఈసారి మూడు పార్టీల మధ్య హోరాహోరీ పోటీ ఉంది. 2008లో ఏర్పడిన భువనగిరి లోక్ సభ నియోజకవర్గం కాంగ్రెస్ కు కంచుకోటగా మారింది. 2009, 2019లలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించగా, 2014లో బీఆర్ఎస్ జండా ఎగరవేసింది. ఈ లోక్ సభ పరిధిలో మునుగోడు, ఇబ్రహీంపట్నం, తుంగతుర్తి, నకిరేకల్, ఆలేరు, జనగామ అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఇక్కడ మొత్తం 16 లక్షల కు పైగా ఓటర్లు ఉన్నారు. ఇందులో పురుషులు దాదాపు 8లక్షల మంది ఉన్నారు. మహిళలు కూడా ఎనిమిది లక్షల చిల్లర ఉన్నారు. మరి అలాంటి ఈ భువనగిరి స్థానంలో జెండా ఎగరవేసేది ఎవరు.