![](https://www.indiaherald.com/cdn-cgi/image/width=750/imagestore/images/politics/politics_latestnews/actor-naresh-fb53fc9c-c701-479a-a16d-78c933708c73-415x250.jpg)
దానికి తార్కాణంగా తాజాగా జరిగిన ఓ సంఘటనని చెప్పుకోవచ్చు. విషయంలోకి వెళితే, ప్రముఖ సీరియల్ నటి పవిత్ర జయరామ్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందగా, ఆ మరణాన్ని తట్టుకోలేని సహ నటుడు, ప్రేమికుడు నటుడు చందు ఆత్మహత్య చేసుకొని చనిపోయిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఈ విషయంపై తాజాగా ఓ మీడియా వేదికగా ఇచ్చిన ఇంటర్వ్యూలో సీనియర్ నటుడు, నిత్య పెళ్లికొడుకుగా పేరుగాంచిన నరేష్ కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆ యాంకర్ సదరు సీరియల్ నటీనటుల వ్యవహారం గురించి ప్రశ్న అడగగా నరేష్ తనదైన శైలిలో సమాధానం చెప్పుకొచ్చారు.
నరేష్ మాట్లాడుతూ... "ఇప్పటిలా కాదు, ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాలు ఉండేవి కాబట్టి ఎవరికన్నా ఏదైనా అయితే, మిగతా వారంతా అండగా ఉండేవారు. ఈ తరం వారు ఎవరికి వారే యమునాతీరే అన్నట్టు వ్యవహరిస్తున్నారు. అమ్మ విజయనిర్మల మరణించినప్పుడు నేను, నాన్న కృష్ణ ఎంతో కృంగిపోయాము. ఆ సమయంలో ఒకరికొకరు మద్దతుగా నిలిచాం. లేదంటే చాలా కోల్పోయేవాడిని. ఒక వ్యక్తి బాధపడుతుంటే.. పది మంది మనకి ఉన్నారు అనే భావన అతనికి కలిగేలా చేయగలిగేవారు లేకపోతే ఇలాంటి ఘటనలే జరుగుతాయి. ఈ పరిస్థితి మారాలి." అంటూ నరేష్ అన్నారు. ఆయన ఉద్దేశం ప్రకారం పవిత్ర మరణం తర్వాత.. చందు తనకిక ఎవరు లేరని ఒంటరిగా ఫీల్ అయ్యి ఉంటాడని, అదే అతని ఆత్మహత్యకు కారణమైందనే అభిప్రాయాన్ని నరేష్ వ్యక్తం చేయడంతో ఆ వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింగా వైరల్ అవుతున్నాయి. అయితే ఈ విషయంలో నరేష్ మాటల్ని వ్యంగ్యంగా తీసుకొనేవారు కూడా లేకపోలేదు. పవిత్ర పేరు వినగానే మనోడికి తన పవిత్ర గుర్తుకు వచ్చి ఉంటుంది అనే అనుమానాన్ని వ్యక్తం చేస్తూ కామెట్స్ చేస్తున్నారు.