ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో వైసీపీ గెలుస్తుందా? లేదా కూటమి గెలుస్తుందా? అన్న చర్చ దేశవ్యాప్తంగా సాగుతోంది. ప్రస్తుత అంచనాల ప్రకారం ఆంధ్రప్రదేశ్ లో కూటమినే అధికారంలోకి వస్తుందని పలు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇంకా చాలా సర్వేల్లో కూడా వైసీపీ గెలుస్తుందని అంచనాలు ఉన్నాయి. కాబట్టి ఫలితాలు చాలా ఉత్కంఠ రేకిస్తున్నాయి.కానీ పక్కనే ఉన్న తెలంగాణలో మాత్రం ఓ పార్టీ ఏమో వైసీపీ గెలవాలని, మరో పార్టీ ఏమో టీడీపీ కూటమి అధికారంలోకి రావాలని కోరుకుంటున్నాయని టాక్ గట్టిగా వినిపిస్తోంది.జగన్‌కు మంచి స్నేహితుడైన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌.. మరోసారి వైసీపీ అధికారంలోకి రావాలని బలంగా కోరుకుంటున్నారు. ఇప్పటికే ఏపీలో వైసీపీ అధికారంలోకి వస్తుందనే సమాచారం ఉందని కేసీఆర్ రెండుమూడు సార్లు చెప్పడం జరిగింది. దీన్ని బట్టి జగన్ మోహన్ రెడ్డి గెలుపును ఆయన ఎంత బలంగా కోరుకుంటున్నారో అర్థమవుతోంది. తెలంగాణలో బీఆర్ఎస్ మళ్లీ స్ట్రాంగ్ అవ్వాలంటే ఏపీలో వైసీపీ గెలవాలని కేసీఆర్ కోరుకుంటున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అప్పుడు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో జగన్ సన్నిహితంగా ఉండే ఛాన్స్ లేదు.


దీంతో రెండు రాష్ట్రాల మధ్య నీటి వాటాలు ఇతర విషయాల్లో గొడవలు ఎక్కువగా జరుగుతాయి. వీటిని అడ్డం పెట్టుకుని తెలంగాణ సెంటిమెంట్‌ను రగిలించి పార్టీ ఉనికిని కాపాడుకోవచ్చిన కేసీఆర్ అనుకుంటున్నారని తెలుస్తుంది.అదే టీడీపీ కూటమి గెలిచి అధికారంలోకి వస్తే ఏపీలో చంద్రబాబు సీఎం అవుతారు. అప్పుడు రేవంత్‌రెడ్డి, బాబు మధ్య ఎలాంటి గొడవలు ఉండవు. ఎందుకంటే ఎవరి రాష్ట్ర ప్రయోజనాల కోసం వాళ్లు ఆలోచిస్తారు. మంచి సానుకూల వాతావరణంలోనే సమస్యలను పరిష్కరించుకుంటారు. అదే జరిగితే అప్పుడు బీఆర్ఎస్‌కు గొంతు చిచ్చుకునేందుకు ఎలాంటి ఛాన్స్ దొరకదనే చెప్పాలి. ఈ నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ ఓటమిని కోరుకుంటున్నారు. తిరుమల వెళ్లిన రేవంత్ రెడ్డి కూడా.. ఆంధ్రాతో కొట్లాట కోరుకోవట్లేదని, సామరస్యంగా సమస్యలు పరిష్కరించుకునే ప్రభుత్వం గెలవాలని అన్నారు. అంటే టీడీపీ కూటమి గెలవాలని రేవంత్ పరోక్షంగా చెప్పారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.ఇలా ఏపీ ఎన్నికల ఫలితాలపై తెలంగాణ నేతలు ఎవరు గెలుస్తారో అన్న టెన్షన్లో ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: