![](https://www.indiaherald.com/cdn-cgi/image/width=750/imagestore/images/politics/politics_latestnews/bonda-uma837b2ec4-7990-4592-b2b5-f09205a4ce68-415x250.jpg)
చంద్రబాబు డైనింగ్ టేబుల్ వరకు వెళ్లే స్వాతంత్రం ఉన్న వ్యక్తి బోండా ఉమ అని స్వయంగా ఆయనే చెప్పుకొచ్చారు. బాబుతో అంత అనుబంధం ఉందని ఆయన చెప్పుకొచ్చారు. 2012 సంవత్సరంలోనే వ్యాపారాలు ఆపేసిన బోండా ఉమ ఆ తర్వాత పూర్తిస్థాయిలో రాజకీయాలకే పరిమితమయ్యారు. బోండా ఉమ ప్రజల కోసం ఏం అడిగినా చంద్రబాబు వెంటనే స్పందించి సమస్యలను పరిష్కరించారని తెలుస్తోంది.
చంద్రబాబుపై చిన్న మాట ఎవరు మాట్లాడినా ధీటుగా స్పందిస్తూ ఇతర పార్టీల నేతలకు వణుకు పుట్టించే నేతగా బోండా ఉమ గుర్తింపును సంపాదించుకున్నారు. బోండా ఉమ ఈ ఎన్నికల్లో విజయం సాధించి కూటమి అధికారంలోకి వస్తే ఆయనకు మంత్రి పదవి వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. బోండా ఉమ ప్రజల సమస్యలను వేగంగా పరిష్కరించే నేతగా గుర్తింపును సొంతం చేసుకున్నారు.
చంద్రబాబు సైతం బోండా ఉమకు తగినంత ప్రాధాన్యత ఇస్తూ అయనతో అనుబంధాన్ని కొనసాగిస్తున్నారు. విజయవాడ సెంట్రల్ ప్రజలు సైతం బోండా ఉమను ఎంతో అభిమానిస్తారని ఆయన ఎమ్మెల్యేగా ఉన్న సమయంలోనే నియోజకవర్గం అభివృద్ధి చెందిందని టాక్ ఉంది. బోండా ఉమ ఏపీ రాజకీయాలలో ఒకింత దూకుడు స్వభావంతో ముందడుగులు వేసే నేతగా పేరు సంపాదించుకున్నారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం నుంచి టీడీపీ తరపున పోటీ చేసిన ఆయనకు ఎలాంటి ఫలితం దక్కుతుందో చూడాలి.