''ఆంధ్రప్రదేశ్లో ఏర్పడే కొత్త ప్రభుత్వంతో సత్సంబంధాలు ఉంటాయి. రెండు తెలుగు రాష్ట్రాల అభివృద్ధి, సంక్షేమం కోసం కలిసి పని చేస్తాం'' అని ఆయన స్పష్టం చేశారు. ఇప్పుడు బాలకృష్ణ, రేవంత్ భేటి అయ్యింది కూడా భవిష్యత్తులో టీడీపీ ప్రభుత్వం వస్తే ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలు ఎలా కలిసి పనిచేయాలని, ఇరు రాష్ట్రాల మధ్య ఉన్న సమస్యలను ఎలా పరిష్కరించాలని అన్న అంశాలపై వారు చర్చించినట్లు తెలుస్తోంది. కానీ అసలు వీరు ఏ అంశాలపైన చర్చించారన్నది మాత్రం క్లారిటీ లేదు. ఈ అంశంపై ప్రతి ఒక్కరూ అంటున్న మాట.. అసలు ఏం చర్చించారన్నది వారే చెప్పాలని. మరి వారు ఈ భేటి ఏమైనా క్లారిటీ ఇస్తారేమో చూడాలి.బాలకృష్ణతో పాటు బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి ట్రస్ట్ సభ్యులు, తదితరులు సీఎం రేవంత్ రెడ్డిని కలిసినవారిలో ఉన్నారు. ఈ భేటీ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి, బాలకృష్ణల మధ్య పలు అంశాల మీద చర్చ జరిగినట్టుగా తెలుస్తోంది. బసవతారకం ఆస్పత్రితో పాటు.. తెలుగు రాష్ట్రాల తాజా రాజకీయ పరిస్థితులపై కూడా ఇరువురు మధ్య చర్చ జరిగిందనే ప్రచారం కూడా సాగుతుంది.అయితే.. ఇటీవలే ఎన్నికల హడావుడి అనంతరం కాస్త విశ్రాంతి తీసుకున్న బాలకృష్ణ ఇప్పుడే మళ్లీ బయటి కార్యక్రమాలలో పాల్గొంటూ ఉన్నారు. తాజాగా రెండు రోజుల క్రితం కాజల్ నటించిన సత్యభామ ఈవెంట్లో పాల్గొన్న బాలయ్య మళ్లీ తాజాగా ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. ఈ కలయికకు సంబంధఙంచిన పూర్తి విషయాలు తెలియాల్సి ఉంది.
''ఆంధ్రప్రదేశ్లో ఏర్పడే కొత్త ప్రభుత్వంతో సత్సంబంధాలు ఉంటాయి. రెండు తెలుగు రాష్ట్రాల అభివృద్ధి, సంక్షేమం కోసం కలిసి పని చేస్తాం'' అని ఆయన స్పష్టం చేశారు. ఇప్పుడు బాలకృష్ణ, రేవంత్ భేటి అయ్యింది కూడా భవిష్యత్తులో టీడీపీ ప్రభుత్వం వస్తే ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలు ఎలా కలిసి పనిచేయాలని, ఇరు రాష్ట్రాల మధ్య ఉన్న సమస్యలను ఎలా పరిష్కరించాలని అన్న అంశాలపై వారు చర్చించినట్లు తెలుస్తోంది. కానీ అసలు వీరు ఏ అంశాలపైన చర్చించారన్నది మాత్రం క్లారిటీ లేదు. ఈ అంశంపై ప్రతి ఒక్కరూ అంటున్న మాట.. అసలు ఏం చర్చించారన్నది వారే చెప్పాలని. మరి వారు ఈ భేటి ఏమైనా క్లారిటీ ఇస్తారేమో చూడాలి.బాలకృష్ణతో పాటు బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి ట్రస్ట్ సభ్యులు, తదితరులు సీఎం రేవంత్ రెడ్డిని కలిసినవారిలో ఉన్నారు. ఈ భేటీ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి, బాలకృష్ణల మధ్య పలు అంశాల మీద చర్చ జరిగినట్టుగా తెలుస్తోంది. బసవతారకం ఆస్పత్రితో పాటు.. తెలుగు రాష్ట్రాల తాజా రాజకీయ పరిస్థితులపై కూడా ఇరువురు మధ్య చర్చ జరిగిందనే ప్రచారం కూడా సాగుతుంది.అయితే.. ఇటీవలే ఎన్నికల హడావుడి అనంతరం కాస్త విశ్రాంతి తీసుకున్న బాలకృష్ణ ఇప్పుడే మళ్లీ బయటి కార్యక్రమాలలో పాల్గొంటూ ఉన్నారు. తాజాగా రెండు రోజుల క్రితం కాజల్ నటించిన సత్యభామ ఈవెంట్లో పాల్గొన్న బాలయ్య మళ్లీ తాజాగా ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. ఈ కలయికకు సంబంధఙంచిన పూర్తి విషయాలు తెలియాల్సి ఉంది.