ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికలు ముగిశాయి. అయితే ప్రస్తుతం సోషల్ మీడియా లో ప్రధాన పార్టీ నేతలు తమ పార్టీ గెలుస్తుంది అంటే తమ పార్టీ గెలు స్తుంది అని భారీ ధీమాతో ఉన్నాయి. అయితే ఏ పార్టీ విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పరుస్తుంది, అలాగే ఏ పార్టీ ప్రతిపక్షం హోదాలో ఉంటుంది అనేది మరో వారం రోజుల్లో తేలనుంది.సోషల్ మీడియాలో కొన్ని సర్వేలు వైసీపీకి అనుకూలంగా ఉంటే మరికొన్ని సర్వేలు టిడిపి కి అనుకూలంగా ఉన్నాయి. దాంతో ఏపీ ప్రజలంతా తీవ్ర ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు.కూటమిలో భాగంగా ఈసారి పవన్ కళ్యాణ్ భారీ మెజారిటీతో గెలుస్తాడని అంటుంటే మరికొన్ని సర్వేలు వైసిపి భారీ సీట్ల తో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందంటున్నారు.దాంట్లో భాగంగానే ప్రస్తుతం జబర్దస్త్ కమెడియన్ కిరాక్ ఆర్ పి ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి పై చేసిన సంచలన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. జూన్ 4వ తేదీన వచ్చేఎన్నికల ఫలితాలలో కూటమి 140- 160 సీట్లు సాధించడం పక్కా అని లండన్ నుంచి జగన్ తిరిగి రాగానే జైలుకు వెళ్లడం ఖాయమని అన్నారు. ప్రస్తుతం ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.అలాగే ఇటీవల కూడా ఆయన జగన్ ను ఇమిటేట్ చేసి వైసీపీ నేతలను ఆగ్రహానికి గురిచేసిన సంగతి తెల్సిందే. ఈసారి జగన్ ను గెలిపిస్తే ఇంట్లో వెంకటేశ్వ రస్వామి, అల్లా, జీసెస్ ఫోటోలు ఉండవని జగన్ ఫోటోనే పెట్టు కోమని కండిషన్స్ పెడతాడాని అన్నాడు.కిరాక్ ఆర్పి చేసిన ఈ వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.దీనిపై స్పందించిన వైసీపీ నేతలు, అభిమానులు, కార్యకర్తలు నువ్వు చెప్పినట్లు కూటమికి అన్నీ సీట్లు రాకపోతే నీ పరిస్థితి ఎలా ఉంటుందో ఉహించుకోమంటున్నారు. అలాగే ఏదైనా తేడా కొడితే ఏపీలో నీ చేపల పులుసు సంగతేంటి అని హెచ్చరిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: