తెలంగాణ రాష్ట్రంలోని ... గులాబీ పార్టీ లో ఉక్కపోత స్టార్ట్ అయింది. ఆ పార్టీలో చాలామంది బయటకు వచ్చే ప్రయత్నం చేస్తున్నారు. దీనంతటికీ కారణం కల్వకుంట కవిత. ఆమె రాసిన ఒకే ఒక్క లేఖ దెబ్బకు... ఆ పార్టీలో ఉండే పరిస్థితి ఎవరికీ లేదని... సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. గులాబీ బాస్ కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు.. బహిరంగ లేఖ రాసి రచ్చ చేసింది కల్వకుంట్ల కవిత. ఆ లేఖ ఎవరి ద్వారా బయటికి వచ్చిందో తెలియదు గానీ.. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో పెద్ద దుమారం లేపుతోంది.

అయితే లేఖ రాసిన తర్వాత... గులాబీ పార్టీ పైన తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నారు కల్వకుంట్ల కవిత. గులాబీ పార్టీలో కెసిఆర్ చుట్టూ అన్ని దెయ్యాలు ఉన్నాయని బాంబు పేల్చారు. అలాగే తనను పార్టీ లోంచి ఎవరు బయటకు పంపలేరని కూడా తెలిపారు. కేటీఆర్ ను టార్గెట్ చేస్తూ విమర్శలు చేశారు కల్వకుంట్ల కవిత. అయితే ఇలాంటి నేపథ్యంలో ఆమెపై వేటు పడుతుందని సోషల్ మీడియాలో ప్రచారం జోరుగా సాగుతోంది.


అయితే ఇలాంటి నేపథ్యంలో....  కాంగ్రెస్ పార్టీ టచ్ లోకి కల్వకుంట్ల కవిత వెళ్లినట్లు తెలుస్తోంది. డీకే శివకుమార్ అలాగే వైయస్ షర్మిల ను  కల్వకుంట్ల కవిత త్వరలో కలవబోతున్నారట. తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ నేతలతో పని కావడం లేదని.... డీకే శివకుమార్ అలాగే వైయస్ షర్మిల తో ప్లాన్ వేసి ఈ కాంగ్రెస్ లోకి వెళ్లేందుకు వ్యూహ రచనలు చేస్తున్నారట కల్వకుంట్ల కవిత.  ఆ ఇద్దరు బడా లీడర్లతో కలిపి.. కాంగ్రెస్ లోకి వెళ్తే... తనకు కీలక పదవి వస్తుందని కల్వకుంట్ల కవిత ఆలోచన చేస్తున్నారట.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ : వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి:

KCR