అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి తన స్టైల్లోనే మాటలు వదిలారు. ఆగస్టు 1 నుంచి పలు దేశాలపై కొత్త సుంకాలు (టారిఫ్‌లు) అమల్లోకి రానున్నాయని స్పష్టం చేశారు. అందులో భారత్‌కి గుడ్ ఫ్రెండ్ ట్యాగ్ ఇచ్చినా… 20% నుంచి 25% వరకూ టారిఫ్‌లు పెంచే అవకాశం ఉందని చెప్పి షాకిచ్చారు. ఇక వరుసగా అమెరికా అధ్యక్షుడి మాటలే కాదు – చర్యలు కూడా తక్షణమే మొదలయ్యేలా ఉన్నాయి. ఇప్పటివరకు అధికారికంగా భారత్‌కి సర్క్యులర్ రాకపోయినప్పటికీ … అమెరికా వైఖరి చూస్తుంటే ఇది ఒకటికాక‌పోతే రెండు రోజుల్లో క్లియర్ అవుతుందని వాణిజ్య విశ్లేషకుల అంచనా. ట్రంప్ స్టైల్ – ఫ్రెండ్ అని చెప్పి ఫైర్ చెయ్యడం! .. ట్రంప్ మీడియాతో మాట్లాడుతూ – “భారత్ మంచి మిత్రదేశం. కానీ గత కొన్నేళ్లుగా అమెరికా మీద ఎక్కువ సుంకాలు వేస్తోంది. ఇక నుంచి ఆ పరిస్థితి మార్చేస్తా. అమెరికా ప్రస్తుత వాణిజ్య నష్టాన్ని తగ్గించడమే నా లక్ష్యం,” అన్నారు. పైగా గతంలో భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతను అమెరికా చొరవతో ఆపగలిగామని కూడా గుర్తు చేశారు.

ఎయిర్ ఫోర్స్ వన్ నుంచే వార్నింగ్! .. అమెరికా అధ్యక్షుడు ఎయిర్ ఫోర్స్ వన్ విమానంలో మీడియాతో మాట్లాడుతూ – భారత్‌పై సుంకాలు విధించడం తప్పదని, 20% నుంచి 25% వరకూ టారిఫ్ విధించే అవకాశముందని తెలిపారు. అంతేకాదు, తాను పదవిలో ఉన్నంతకాలం టారిఫ్ పాలసీ కంటిన్యూ అవుతుందన్న స్పష్టత కూడా ఇచ్చారు. భారత్ నుండి ఎక్కువ సుంకాలు వసూలవుతున్నాయా? .. అమెరికా అఫీషియల్ గణాంకాల ప్రకారం, భారత్ కొన్ని కీలక ఉత్పత్తులపై అమెరికా కంపెనీలకు పెద్దస్థాయిలో సుంకాలు విధిస్తోందని వాదిస్తున్నారు. ఇదే విషయాన్ని ట్రంప్ ఇప్పుడు ముందుకు తెస్తున్నారు. కానీ భారత్ ఇంకా ఈ అంశంపై ఆఫీషియల్‌గా స్పందించలేదు.

భారత వైఖరి: నెగోషియేషన్ మోడ్ .. ఇక కేంద్ర మంత్రి పియూష్ గోయల్ స్పందిస్తూ – “భారత్ ఎంతో ఆత్మవిశ్వాసంతో వాణిజ్య ఒప్పందంపై చర్చలు జరుపుతోంది. తగిన నిర్ణయాలు తీసుకుంటాం. ఈ చర్చలు ద్వైపాక్షిక బలమైన ఒప్పందానికి దారితీస్తాయని నమ్మకంగా ఉంది” అన్నారు. విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్త్రీ కూడా ఇదే టోన్‌లో స్పందించారు. ఫైనల్ గా చెప్పాలంటే… వాణిజ్యంలో నువ్వా నేనా యుద్ధం మొదలైపోయింది. ట్రంప్ గేమ్ ఓపెన్ చేశాడు. ఇప్పుడు మోదీ టీం ఎంత ధీర్ఘ దృష్టితో తడపకుండా డీల్‌ చేస్తుందో చూడాలి. లేకపోతే టారిఫ్ భారంతో ఇండియన్ మార్కెట్లపై భారం పడడం ఖాయం!

మరింత సమాచారం తెలుసుకోండి: