మన భారత దేశంలో స్వతంత్రం వచ్చాక కూడా ఎస్సీ , ఎస్టీ లకు సమాన న్యాయం దొరకడం లేదు అని వారిని కులం పేరుతో వివక్షించే వారు ఉన్నారు అనే ఉద్దేశంతో ఎస్సీ , ఎస్టీ లను ఎవరైనా కులం పేరుతో దూషించినట్లయితే వారికి కఠిన శిక్షాలను విధించేటట్లు భారత రాజ్యాంగంలో ఆర్టికల్ ను పొందుపరిచారు. దానితో ఎవరైనా ఎస్సీ , ఎస్టీలను వారి కులం పేరుతో దూషించినట్లయితే వారికి గట్టి శిక్షలు పడ్డాయి. కానీ దీనిని ఒక న్యాయవాది అలుసుగా చేసుకుని ఒక అమ్మాయిని అడ్డు పెట్టుకొని పెద్ద గేమ్ నడిపాడు. తాజాగా ఆయన చేసిన ఉదాంతం మొత్తం బయటకు వచ్చింది. దానితో ఆయనకు భారీ షాక్ తగిలింది. ఇంతకు ఎస్సీ , ఎస్టీ కేసును అడ్డం పెట్టుకొని న్యాయవాది ఏం చేశాడు ..? అతనికి చివరికి ఏం జరిగింది ..? అనే వివరాలను తెలుసుకుందాం.

ఉత్తరప్రదేశ్ కు సంబంధించిన లాయర్ పరమానంద గుప్తా ఒక ఎస్సీ అమ్మాయిని అడ్డం పెట్టుకొని అనేక మంది మీద అనేక ఫేక్ కేసులు పెట్టాడు అని తాజాగా తేలింది. ఉత్తరప్రదేశ్ కు సంబంధించిన లాయర్ పరమానంద గుప్త ఎస్సి అమ్మాయిని అడ్డం పెట్టుకొని ఎవరితోనైనా ఆమె గొడవలు పెట్టే విధంగా చూసి , గొడవ అయ్యాక ఆమెను కులం పేరుతో దూషించారు అని చెప్పి లాయర్ స్వయంగా ఆమెను పోలీస్ స్టేషన్ తీసుకు వెళ్లి కేసులు పెట్టించడం , ఆ తర్వాత ఈయన దగ్గరుండి సెటిల్మెంట్ చేయడం , అలాగే ఏదైనా వ్యాపార విషయాల్లో కూడా ఈమె కలగజేసుకొని సెటిల్మెంట్లు చేయడం , అక్కడ ఏదైనా తేడా కొడితే కులం పేరుతో దూషించారు అని కేసు పెట్టడం  , దాన్ని కూడా లాయర్ స్వయంగా సెటిల్ చేయడం జరుగుతూ వచ్చినట్లు , ఇవి తాజాగా కోర్టుకి తెలిసింది. దానితో ఈయన ఏమేమి చేశాడు అనే నివేదికను పూర్తిగా బయటకు తీయమని కోర్టు సూచించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: