
విశాఖను రాష్ట్ర ఆర్థిక రాజధానిగా ప్రకటించిన ఆయన, స్థానిక ప్రజలు తమ పార్టీకి 91 వేల మెజారిటీ ఇచ్చి నమ్మకం చూపారని గుర్తు చేశారు.లోకేష్ మాట్లాడుతూ, 100 బిలియన్ డాలర్ల పెట్టుబడుల్లో 50 శాతం విశాఖకు వస్తున్నాయని తెలిపారు. విశాఖలో 5 లక్షల ఐటీ ఉద్యోగాలు సృష్టిస్తామని, కాంటిజెంట్, సత్వ, గూగుల్, టీసీఎస్ సంస్థలు గ్రేటర్ విశాఖ ఆర్థిక జోన్లో స్థాపనకు సిద్ధమవుతున్నాయని పేర్కొన్నారు.
హుద్ హుద్ తుఫాను సమయంలో విశాఖ ప్రజలు చూపిన నమ్మకాన్ని ప్రధాని కూడా ప్రశంసించారని ఆయన గుర్తు చేశారు. డబుల్ ఇంజిన్ ప్రభుత్వం బులెట్ ట్రైన్లా పనిచేస్తోందని ఆయన వ్యాఖ్యానించారు.విశాఖ స్టీల్ ప్లాంట్ అభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సహకరిస్తున్నాయని లోకేష్ తెలిపారు. 14,000 కోట్ల రూపాయల పెట్టుబడితో ప్లాంట్లో ఒక ఫర్నేస్ నుంచి మూడు ఫర్నేస్లు పనిచేస్తున్నాయని చెప్పారు.
రైల్వే జోన్ స్థాపన కూడా త్వరలో జరుగుతుందని ఆయన హామీ ఇచ్చారు. రానున్న మూడు నెలల్లో విశాఖలో అనేక సంస్థలు తమ కార్యకలాపాలను ప్రారంభిస్తాయని ఆయన పేర్కొన్నారు. ఈ చర్యలు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంతో పాటు యువతకు ఉపాధి అవకాశాలను పెంచుతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
వాట్సాప్ నెంబర్ 94905 20108 కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 94905 20108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు