“కార్యకర్తల భావాలు పార్టీ బలం… వారి అభిప్రాయమే మా దారి” అని పవన్ అర్థమై చెప్పేలా, ప్రతి నిర్ణయం క్యాడర్ సెంట్రిక్గా జరుగుతోంది. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, కృష్ణా, విజయనగరం, శ్రీకాకుళం, ఉభయగోదావరి జిల్లాలు – ఇవి జనసేనకు మాస్స్ బేస్ ఉన్న ప్రాంతాలు. ఇక్కడ పార్టీ శక్తి ఇప్పటికే స్థిరంగా ఉంది. ఇప్పుడు ఈ ప్రాంతాల్లో నాయకత్వాన్ని పటిష్టం చేసి, ప్రతి గ్రామం వరకు కమిటీలు ఏర్పాటు చేస్తే… క్యాడర్ అట్టహాసం ఏ స్థాయిలో ఉంటుందో అంచనా వేయడం కష్టమే. పవన్ స్పష్టంగా చెప్పిన మాట – “గ్రామంలో శబ్దం వినిపిస్తే… జనసేన గర్జన వినిపించాలి!” గ్రాస్రూట్ స్థాయిలో కమిటీలు ఏర్పడితే, ప్రజల సమస్యలు నేరుగా నాయకత్వానికి చేరతాయి. గ్రామం – మండలం – జిల్లా కమిటీలు ఒక చైన్లా పనిచేస్తాయి. ఈ నిర్మాణం వల్ల పార్టీ మరింత క్రమబద్ధత, పదునైన వ్యూహంతో ముందుకు సాగుతుంది.
ఇక ముఖ్యంగా గ్రామాల్లో యువత, మహిళలు, రైతుల్లో పెరిగిన పాజిటివ్ సెంటిమెంట్ను బలోపేతం చేయడానికి ఇది గేమ్ ఛేంజర్ కానుంది. 2024 ఎన్నికల తర్వాతే పవన్ పూర్తిస్థాయి వ్యూహం రెడీ చేశారు. కేంద్ర బృందం 100కి పైగా నియోజకవర్గాల్లో సర్వేలు చేసి, వేలాదిగా క్యాడర్ నుండి అభిప్రాయాలు సేకరించింది. 2025 డిసెంబర్లో జిల్లా కమిటీలు, 2026 మధ్య నాటికి మండల–గ్రామ కమిటీలు పూర్తిచేయాలని పవన్ డెడ్లైన్ ఇచ్చారు. ఇవన్నీ అమలు అయితే… ఆంధ్రప్రదేశ్ ప్రతి కోనలో జనసేన జెండా ఎగురుతుందనే మాట. మొత్తానికి… పవన్కల్యాణ్ స్ట్రాటజీ క్లియర్ – పార్టీలో క్రమశిక్షణ, క్షేత్రస్థాయి బలం, క్యాడర్ ఆత్మవిశ్వాసం! రాబోయే ఎన్నికల్లో ఈ గ్రాస్రూట్ శక్తి… జనసేనకు డెసైడింగ్ ఫ్యాక్టర్ కానుంది!
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి