మందు కిక్కుకు అలవాటైన ప్రాణాలకు సమయానికి మందు గొంతులో దిగకపోతే మనసుకు పట్టదు. ఏదో ఒకటి చేసి ఓ పెగ్గు గొంతులో పోయాల్సిందే. అయితే కొందరికి మాత్రం ఎంత తాగినా కిక్కు రాదు. ఓవైపు జేబులు ఖాళీ అవుతున్నా.. మనసు కోరుకున్న కిక్కు దొరక్క ఇబ్బందిపడుతుంటారు. అలాంటి వాళ్ల కోసం ఇప్పుడో గుడ్ న్యూస్ బయటికొచ్చింది. 

కిక్కు కోసం ఇక కష్టాలుపడాల్సిన అవసరం లేదు. మందులో ఆ స్పెషల్ మందు ఓ చుక్క వేసుకుంటే చాలు.. వద్దన్నా కిక్కు వచ్చి మైండ్ లో దూరిపోతుందట. మరి ఆ మందు ఎక్కడ దొరుకుతుంది.. దాని రేటు ఎంత.. అని అప్పుడే అడిగేయకండి.. అది మాత్రం సీక్రెట్.. ఆ మందేంటో తెలియక విజయవాడ పోలీసులు కూడా తలపట్టుకుంటున్నారు. ఆ సంగతి తేల్చమని సైంటిస్టుల దగ్గరకు పరిగెత్తారు. 

మొన్న విజయవాడ కృష్ణలంకలో కల్తీ మద్యం ఘటనలో ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణలో ఈ విచిత్రం వెలుగు చూసింది. ఈ కేసులో ఇప్పటికే అరెస్టయిన వాళ్లను పోలీసులు తమదైన స్టైళ్లో విచారిస్తే.. ఈ సీక్రెట్ బయటికొచ్చింది. స్వర్ణాబార్ లోనే మద్యం కల్తీ అయినట్లు విచారణ బృందం క్లారిటీకి వచ్చింది. స్వర్ణ బార్ నిర్వహణలో కీ రోల్ పోషిస్తున్న మల్లాది శ్రీనివాస్ ఈ సీక్రెట్ చెప్పారు. కానీ అదేంటో తనకూ తెలియదని కటింగ్ ఇచ్చారు. 

స్వర్ణా బార్ లో రెగ్యులర్ కష్టమర్లకు ఎక్కువ కష్టపడకుండానే మత్తు త్వరగా ఎక్కేందుకు ఈ లిక్విడ్ కలుపుతున్నారట. ఒక గ్లాసు మద్యంలో కేవలం ఒక్క చుక్క కలిపితే చాలు కావాల్సినంత కిక్కు ఎక్కుతుందట. ఇప్పటికే పోలీసులు బార్ నుంచి మద్యం బాటిళ్లతో పాటు ఈ స్పెషల్ మందు బాటిళ్లు కూడా స్వాధీనం చేసుకున్నారట. అయితే ఈ మందు కలపడంలో డోస్ తేడా వచ్చినందువల్ల ఏడుగురు వరకూ చనిపోయారు. కిక్కు కోసం ఆశపడితే ఏకంగా వైకుంఠం టిక్కెట్టే తగ్గుతుంది. మరి జాగ్రత్త. 


మరింత సమాచారం తెలుసుకోండి: