రామచంద్రం తాను చేసే పొగాకు వ్యాపారంలో పెట్టుబడికనో, నష్టం వచ్చింది అనో, అప్పులు తీర్చాలనో సాకులు చెబుతూ తండ్రి దగ్గర నుండి పెద్దమొత్తాన్నే తీసుకుపోతుండేవాడు. పొలం తాకట్టు పెటో, కొంత అమ్మేసో సొమ్ము తెచ్చి కొడుక్కి ఇస్తుండేవాడు. అయితే వీరయ్య మహా తెలివైన వాడు.. వీరయ్య ఇచ్చిన ప్రతి పైసా జాగ్రత్తగా లెక్కలు రాసేవాడు . ఓసారి లెక్కలు చూసుకుంటే, ఆస్తిలో సగం కొడుకు అవసరాలకే ఖర్చు అయిపోయినట్లు తెలుస్తోంది.
ఒకరోజు రాత్రి వీరయ్య పొలం నుండి తిరిగి వస్తుంటే పాము కరిచి అక్కడికక్కడే మరణించాడు. పెద్దకర్మ పూర్తయ్యాక పెద్దల సమక్షంలో తండ్రి వీలునామాను బయటకు తీయించారు రామచంద్రం, అతని భార్య కాంతామణి.. అందులో ఇలా ఉంది.. ఆస్తి అంత నా స్వార్జితం.. అందులో సగం భాగం నా కొడుకు అవసరాల కోసం ఖర్చు చేయడం జరిగింది. మిగిలి వున్న పొలాన్ని నా భార్య రాజ్యలక్ష్మి కి, నా కూతురు లక్ష్మీ దేవికి సమానంగా ఇస్తున్నాను. ఇంటిని నా భార్యకు , నా కుమారుడు రామచంద్రం వ్యాపారం కోసం నా దగ్గర నుండి తీసుకున్న సొమ్మంతా.. అతనికి.. మనస్ఫూర్తిగా రాసి ఇస్తున్నాను అని అందులో రాసి వుంది.
అతి తెలివితో మామగారిని మోసం చేయాలనుకున్న కాంతామణి, వీరయ్య అత్యంత తెలివిగా వీలునామా రాసి తమకు బుద్ధి చెప్పడంతో లబోదిబోమంది. మోసం అనేది ఎప్పటికీ పనికిరాదు.