ప్రస్తుతం ఆయన చాలా వేగంగా కోలుకుంటున్నారు అని ముందు జాగ్రత్తగా ఆయనను స్వాగత వేడుకలకు వద్దని చెప్పామని ఆయన సన్నిహితులు వివరించారు. ఈ కార్యక్రమానికి చాలా మంది హాజరు అయ్యారని తన గ్రామానికి సమీపంలో స్వాగత కార్యక్రమం జరిగే ప్రదేశం కావలెకేడ్ కి చేరుకున్నాడని ఫంక్షన్ జరిగే ప్రదేశానికి చేరుకోవడానికి సమయం పట్టిందని వెల్లడించారు. ఫంక్షన్ మధ్యలో అతను అలసిపోయినట్లు కనిపించాడు అని స్వల్పంగా జ్వరం రావడం మొదలయింది అని పేర్కొన్నారు.
అతడిని ఆసుపత్రికి తరలించినట్లు కొన్ని పుకార్లు ఉన్నాయి అని ఇది నిజం కాదని అన్నారు. అతను బాగానే ఉన్నాడు అని ఇది తీవ్రమైన సమస్య కాదు అని ఆయన సన్నిహితులు వివరించారు. సాధారణంగా, అతను టోక్యో నుండి వచ్చిన తర్వాత అనేక కార్యక్రమాలకు నాన్ స్టాప్ గా హాజరు కావడం వల్ల అలసిపోయినట్లు అనిపిస్తుందన్నారు. 23 ఏళ్ల నీరజ్ ఒలింపిక్స్ లో స్వర్ణం గెలిచిన భారత ట్రాక్ అండ్ ఫీల్డ్ అథ్లెట్ గా చరిత్ర సృష్టించాడు. అతను పానిపట్ నుండి 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న తన స్వస్థలమైన ఖండ్రా గ్రామానికి వెళ్లాడు అని ఆయన సన్నిహితులు వివరించారు. ఇక ఆయనకు జ్వరం కారణంగా కరోనా పరిక్షలు కూడా నిర్వహించామని సన్నిహితులు మీడియాకు తెలిపారు.