అయితే వన్డే సిరీస్ లో అటు సౌత్ ఆఫ్రికా జట్టు ఓడిపోయినప్పటికీ ఒక సరికొత్త రికార్డును నెలకొల్పింది అని చెప్పాలి. ఓడిపోయిన ఏదో ఒక రికార్డు నెలకొల్పాలని అనుకుందో లేకపోతే ఇంకేదైనా కారణం ఉందో కానీ సౌత్ ఆఫ్రికా సాధించిన రికార్డు మాత్రం ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోతుంది అని చెప్పాలి. మూడో వన్డే మ్యాచ్ కు డేవిడ్ మిల్లర్ కెప్టెన్గా వ్యవహరించాడు అన్న విషయం తెలిసిందే. అయితే భారత్ తో జరిగిన మూడు వన్డే మ్యాచ్లో సిరీస్ లో భాగంగా సౌత్ ఆఫ్రికా తమ జట్టు సారధులను మార్చడం మూడోసారి కావడం గమనార్హం.
మొదటి వన్డే కు రెగ్యులర్ కెప్టెన్ టెంప భావుమా కెప్టెన్సీ వహించగా రెండో వన్డేలో కేశవ్ మహారాజ్ సారధ్య బాధ్యతలు చేపట్టాడు. బావుమా అనారోగ్య కారణాల వల్ల మిగిలిన రెండు మ్యాచ్లకు దూరమయ్యాడు. అయితే కేశవ మహారాజ్ సైతం విశ్రాంతి కోరుకున్నట్లు తెలుస్తుంది. దీంతో ఇక మూడో వన్డే మ్యాచ్ కి డేవిడ్ మిల్లర్ ను కెప్టెన్ గా నియమిస్తూ ఆ దేశ క్రికెట్ బోర్డు నిర్ణయం తీసుకుంది. అంతర్జాతీయ క్రికెట్లో మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ లో ఒక్కో మ్యాచ్ కి ఒక్కో కెప్టెన్ రావడం ఇదే మొదటిసారి అని చెప్పాలి. ఇలా కెప్టెన్లు మార్చడంలో సౌత్ ఆఫ్రికా రికార్డు సృష్టించింది. అయితే ఇదే విషయంపై టీం ఇండియా మాజీ ఆటగాడు స్పందిస్తూ తనదైన శైలిలో ఒక పోస్ట్ పెట్టాడు. ఇది కాస్త వైరల్ గా మారిపోయింది.