అదేమిటి వైసీపీ ప్రభుత్వ హయాంలో చంద్రబాబునాయుడు భజన ఎలా జరుగుతుంది ? పైగా అసెంబ్లీ సమావేశాల్లో చంద్రబాబు భజన జరగటం ఏమిటి ? అనేగా మీ డౌట్ ? అవును ఐదు రోజుల శీతాకాల సమావేశాల్లో భాగంగా బుధవారం అసెంబ్లీలో చంద్రన్న భజన జరిగింది వాస్తవం. అయితే ఈ భజనను వైసీపీ ప్రభుత్వమో లేకపోతే ఎంఎల్ఏలో చేయలేదు. టీడీపీ హయాంలో జరిగిన భజనను తాజగా అసెంబ్లీ సమావేశాల్లో వీడియో క్లిప్పింగ్ వేసి చూపించారు. ఈ వీడియోను చూసిన జగన్మోహన్ రెడ్డి, స్పీకర్ తమ్మినేని సీతారామ్ తో పాటు మంత్రులు, ఎంఎల్ఏలు తెగ ఎంజాయ్ చేశారు. ఇందులో భాగంగానే కొందరు టీడీపీ ఎంఎల్ఏలు కూడా పడి పడి నవ్వుకున్నారట లేండి వీడియోను చూసిన తర్వాత. కాకపోతే చంద్రబాబు మొహం మాత్రం మాడిపోయింది. ఎందుకంటే అప్పట్లో డబ్బులిచ్చి మరీ భజన చేయించుకున్నారు కదా. అదే విషయం ఇపుడు గుర్తుకొచ్చుంటుంది.




ఇంతకీ విషయం ఏమిటంటే టీడీపీ హయాంలో పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పెద్ద ప్రహసనంగా మారిన విషయం అందరికీ తెలిసిందే. ప్రతి సోమవారం నాడు పోలవరం పనులను సమీక్షించే పేరుతో పోలవారంగా స్వయంగా చంద్రబాబే నామకరణం చేశారు. అప్పట్లో ప్రతి సోమవారాన్ని పోలవారం అంటు పెద్ద పెద్ద డైలాగులు కొడుతు నానా హంగామా చేసేవారు. ఎన్నికలకు ముందు పోలవరం పనులను చూపించే నెపంతో రాష్ట్రంలోని టీడీపీ నేతలను, రైతులను బృందాలుగా పోలవరం ప్రాజెక్టు సైటుకు తీసుకెళ్ళిన విషయం గుర్తుండే ఉంటుంది. ప్రాజెక్టును సందర్శించిన అనేక బృందాల్లో టీడీపీ మహిళన భజన బృందం కూడా ఉంది లేండి. ఆ బృందమే పోలవరం ప్రాజెక్టు సందర్శన సందర్భంగా సైటులోనే చంద్రబాబు భజన చేశారు. షిరిడీ సాయిబాబాకో లేకపోతేత పుట్టపర్తి సాయిబాబాకో భజన చేశారు. ‘జయము జయము చంద్రన్న..జయము నీకు చంద్రన్న’ అంటూ పెద్ద భజనే చేశారు అప్పట్లో.




తాజా అసెంబ్లీ సమావేశాల్లో ఆ భజన వీడియో క్లిప్పుంగునే ప్రభుత్వం అసెంబ్లీలో ప్లే చేసి అందరికీ చూపించింది. అంటే పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పేరుతో చంద్రబాబు ఆడిన నాటకాలు, వేసిన వేషాలు, చేయించుకున్న భజనలు, చేసిన కోట్ల రూపాయల వృధాను వీడియో క్లిప్పింగ్ ద్వారా ఎండగట్టమే జగన్మోహన్ రెడ్డి ఉద్దేశ్యం. ఇటువంటి భజనలు చేయించుకునేందుకు చంద్రబాబు అప్పట్లో రూ. 85.45 కోట్లు ఖర్చు చేసినట్లు జగన్ చెప్పటంతో అందరు ఆశ్చర్యపోయారు. వీడియో క్లిప్పింగ్ ను చూసినంతసేపు జగన్+తమ్మినేని+సభ్యులు పడి పడి నవ్వుతునే ఉన్నారు. చంద్రబాబు హయాంలో పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి ప్రచారం ఎక్కువ పనులు తక్కువ జరిగిన విషయాన్ని జగన్ ఎండగట్టేశారు. మొత్తానికి చంద్రబాబుకున్న ప్రచార పిచ్చిని తనదైన స్టైల్లో జగన్ ఏకంగా అసెంబ్లీలోనే వాయించిపడేశారు. దాంతో మాట్లాడేందుకు లేకపోవటంతో చంద్రబాబు మొహం మాడిపోయింది.


మరింత సమాచారం తెలుసుకోండి: