తిరుపతి తెలుగువారికి పవిత్ర పుణ్య క్షేత్రం.. ఆయన ఆయన 7 కొండలు పైన ఉంటాడు. మరి ఈ ఏడు కొండల ప్రత్యేకత ఏంటి.. తెలుసుకుందామా.. మొదటి కొండ వృషభాద్రి - అంటే ఎద్దు. వృషభానికి ఋగ్వేదం లో ఒక సంకేతం ఉంది. ఎద్దు మీద పరమ శివుడు కూర్చుంటాడు. దానికి 4 కొమ్ములున్టాయ్. 3 పాదాలు భూత, భవిష్యత్, వర్తమాన కాలాలు .. వాక్కు అంటే - శబ్దం, శబ్దం అంటే - వేదం, వేదం అంటే - ప్రమాణము.. వేదము యొక్క ప్రమాణాన్ని అంగీకరించిన వాడు మొదటి కొండ ఎక్కుతాడు.


రెండో కొండ వృషాద్రి - అంటే ధర్మం.. ధర్మం అంటే - నువ్వు వేదాన్ని అనుసరించి చేయవలసిన పనులు. నీకు భగవంతుడు ఇచ్చిన వాటితో మంచివి వినడం, చూడడం, మంచి వాక్కు etc. దాని వల్ల ఇహం లోను, పరలోకం లోను సుఖాన్ని పొందుతాడు. అవి చెయ్యడమే వృషాద్రి ని ఎక్కడం.


మూడ కొండ గరుడాద్రి - అంటే పక్షి - ఉపనిషత్తుల జ్ఞానాన్ని పొందడం. కళ్యాణ గుణ సహితుడు, హేయగుణ రహితుడు. అటువంటి భగవానుణ్ణి జ్ఞానం చేత తెలుసుకోవడమే గరుడాద్రి. నాలుగో కొండ అంజనాద్రి - అంజనం అంటే కంటికి కాటుక. కాటుక ఎప్పుడు పెట్టుకుంటాం? అందానికి, చలవకి. కంటికి అందం ఎప్పుడు? - ఈ కంటితో చూడవలసినవి మాత్రమే చూసినపుడు. ఈ కంటితో చూసిన దాంట్లో అంతటా బ్రహ్మమే ఉందని తెలుసుకోవడం కంటికి కాటుక. ఇదంతా పరమాత్మ సృష్టియే. అప్పుడు అంజనాద్రి దాటతాడు.


ఐదో కొండ శేషాద్రి - ప్రపంచం అంతా బ్రహ్మమే అని చూసాడనుకోండి వాడికి రాగ ద్వేషాలు ఉండవు. వాడికి క్రోధం ఉండదు. వాడికి శత్రుత్వం ఉండదు. అంతా బ్రహ్మమే అనుకునేవాడికి భయం ఉండదు. ఎప్పుడూ ఒకేలా ఉండడమే బ్రహ్మం. ఆ స్థితికి ఎక్కితే శేషాద్రిని ఎక్కడం.ఆరో కొండ వేంకటాద్రి - వేం : పాపం, కట : తీసేయడం. కాబట్టి పాపాలు పోతాయి. అంతా బ్రహ్మమే చేయిస్తున్నాడు, అందుకనే మనకి బ్రహ్మం తెలిసిన వారు పిచ్చి వాళ్ళలా కనవడుతారు అది మన కర్మ. రామ కృష్ణ పరమహంస ఈ పిచ్చి నాకు ఎప్పుడు వస్తుందో అంటూ ఉండేవారు. అందుకే జ్ఞాని, పిచ్చి వాడు ఒకలా ఉంటారు. ఆయనకే అర్పణం అనడం.. అటువంటి స్థితి ని పొందడం వెంకటాద్రి ఎక్కడం.


ఇక ఆఖరుది.. ముఖ్యమైందీ.. నారాయణాద్రి - అంటే తుల్యావస్థ ని కూడా దాటిపోయి, తానే బ్రహ్మముగా నిలబడిపోతాడు. అటువంటి స్థితిని పొందడం నారయానాద్రి. వేంకటాచలం లో 7 కొండలు ఎక్కడం వెనకాల ఇంత నిక్షేపాలను ఉంచారు. ఈ కారణాలు తెలుసుకోవడం 7 కొండలు ఎక్కడం.. ఇదీ తిరుమల ఏడుకొండల విశిష్టత.


మరింత సమాచారం తెలుసుకోండి: