మారేడును ''శివేష్ట'' అని అంటారు. మారేడును బిల్వ అని కూడా అంటారు. బిల్వం అంటే శ్రీ ఫలము. అంటే లక్ష్మీదేవికి ఇష్టమైన ఫలములు ఇచ్చేది, ఇంకా సిరిని తెచ్చే ఫలము కలది అని అర్ధం. మారేడు మహా మంగళకరమైనది. మారేడు పత్రాలు త్రిశిఖలా ఉంటాయి. మూడు ఆకులతో ఉన్నందున త్రిశూలానికి సంకేతంగా భావిస్తారు.
ఈశ్వరాధనలో మారేడు దళాలను తప్పనిసరిగా వాడుతారు. మారేడు దళాలతో పూజిస్తే శివుడు త్వరగా అనుగ్రహిస్తాడని, పూజలో ఎంత ఎక్కువ బిల్వ పత్రాలు వాడితే అంత ఎక్కువ కరుణాకటాక్షాలు ప్రసాదిస్తాడని, మోక్షం కూడా ప్రాప్తిస్తుందని వేదాలు గట్టిగా చెబుతున్నాయి. కనుకనే శివ పూజలో బిల్వ పత్రాలు విస్తృతంగా ఉంటాయి.

కొందరు లక్ష బిల్వ పత్రాలతో, మరికొందరు ఏకంగా కోటి బిల్వ పత్రాలతో శివుని పుజిస్థుంటారు. సర్వ శుభాలూ చేకూర్చి, మోక్షాన్ని ప్రసాదిస్తుంది కనుక బిల్వ వృక్షాన్ని దైవంతో సమానంగా చాలా మంది కొలుస్తారు.


పూజలు, పునస్కారాల్లో పూవులతో బాటు కొన్ని ఈ ఆకులను ఉపయోగిస్తారు. వాటిల్లో బిల్వ పత్రం ముఖ్యమైంది, శ్రేష్ఠమైంది. ఇది కేవలం ఆచారం మాత్రమే కాదు. బిల్వ పత్రాలతో పూజించడం వెనుక శాస్త్రీయత కూడా ఉంది. గాలిని, నీటిని శుభ్రపరచడంలో మారేడు ఆకులను మించినవి లేవు అంటే నమ్మండి. ఈ చెట్టు నుండి వచ్చే గాలి శరీరానికి సోకడం ఎంతో మంచిది అంటారు. ఈ గాలిని పీల్చడం వల్ల మేలు జరుగుతుంది అలాగే జబ్బులు రావు. బాహ్య, అంతర కణాలు అశుద్ధం కాకుండా వుండేట్లు చేసి, దేహాన్ని శ్రేష్ఠంగా శుభ్రంగా ఉంచుతుంది.


దేవాలయం గర్భ గుడిలో గాలి సోకదు, సూర్యకిరణాలు ప్రసరించవు కనుక స్వచ్చత కోల్పోయే అవకాశం ఉంటుంది. అలాంటి వాతావరణంలో కూడా మారేడు ఆకులు స్వచ్చతను కలుగచేస్తాయి. అది మారేడుకు ఉన్న విశిష్టత. సూర్యుడిలో ఉండే తేజస్సు మారేడులో ఉంటుంది. శరీరం లోపలి భాగాల్లో, బయట వాతావరణంలో ఎక్కడ చెడు ప్రభావం ఉన్నా, దాన్ని హరించి మెరుగుపరచడమే మారేడు మరొక లక్షణం.


బిల్వ దళాల్లో తిక్తాను రసం, కషాయ రసం, ఉష్ణ వీర్యం అనేవి ఉంటాయి. మారేడు ఆ రుచులని  పోగొడుతుంది. జఠరాగ్నిని కూడా వృద్ది చేస్తుంది, ఇంకా వాత లక్షణాన్ని తగ్గిస్తుంది. అలాగే మలినాలను పోగొడుతుంది. వీటితో పాటు శ్లేష్మాన్ని, అతిసారాన్ని తగ్గిస్తుంది, గుండె సంబంధమైన వ్యాధులను తగ్గించడంలో ఈ ఆకు ప్రభావం ఉంటుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: