ఆంధ్రప్రదేశ్ లో వెలసి యున్న కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామికి ఏ స్థాయిలో భక్తులు ఉన్నారో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ప్రపంచం నలుమూలల నుండి ఈ తిరుమలేశుని దర్శించుకోవడానికి సీజన్ తో సంబంధం లేకుండా భక్తులు తరలి వస్తూ ఉంటారు. అయితే గతంలో కన్నా కూడా ఇప్పుడు తిరుమలకు వచ్చే భక్తులకు సేవలు మరియు దర్శనం విషయంలో సామాన్యులకు అందుబాటులో ఉండే విధంగా టీటీడీ పాలన కొనసాగిస్తోంది అని చెప్పాలి. అయితే ఇప్పుడు వీరు కొత్తగా తీసుకొచ్చిన విధానం గురించి తెలిస్తే శ్రీవారికి ఉన్న కోట్ల మంది భక్తులు సంతోషంతో ఉప్పొంగి పోతారు. ఇంతకు ముందు వరకు అయితే ప్రతి వారం చివరలో విఐపి బ్రేక్ అనే విభాగం ఉండేది.

ఈ విభాగంలో ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులు మాత్రమే కాకుండా వారికి తెలిసినా తెలియక పోయినా ఒక అనుమతి లెటర్ తో చాలా మంది ఈ సేవను ఉపయోగించుకుంటూ ఉండేవారు. దీని వలన సామాన్య భక్తులకు ఇబ్బంది అవుతోందని గమనించిన టీటీడీ పాలక మండలి ఈ విధానానికి చెక్ పెడుతూ నిర్ణయం తీసుకుంది. ఇక వీకెండ్ లో వీఐపి టికెట్ పై బ్రేక్ దర్శనాలు లేవు. ఇలా చేయడం వలన ఇంతకు ముందు వీఐపీల కోసం కేటాయించే కొంత సమయం కూడా ఇప్పుడు సామాన్య భక్తుల కోసం ఉపయోగం కానుంది. కాబట్టి ఇప్పుడు శుక్ర, శని మరియు ఆది వారాలలో సామాన్య భక్తుల కోసం అదనంగా టికెట్ల అందుబాటులో ఉంచనున్నారు.

అయితే ప్రస్తుతం మాత్రం ఒక రోజుకు 30 వేల టికెట్ల ఇస్తున్నారు. అయితే ఇప్పుడు బ్రేక్ దర్శనం లేదు కాంట్టి మరో కొన్ని టికెట్లు పెరిగే అవకాశం ఉంది. ఈ విషయం గురించి తెలిసిన భక్తులు తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇది ఎప్పుడు నుండి అమలు అవుతుంది అనే విషయం తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: