హిందూ సాంప్రదాయం ప్రకారం పూజలోనూ, పెళ్లిలలోనూ తమలపాకుల తాంబూలంకు ప్రత్యేక స్థానం ఉంది. తమలపాకులు లక్ష్మీదేవి ప్రతిరూపంగా భావించి, ఇంట్లో తమలపాకు చెట్టును పెంచుకుంటూ ఉంటారు. అంతేకాక భోజనం తర్వాత తమలపాకుతో చేసిన కిల్లి నమలడం ద్వారా,తిన్న ఆహారం సరిగా జీర్ణం అవ్వడమే కాక, నోటి సమస్యలు కూడా తగ్గిపోతాయి. చాలామంది వ్యాపారాలు చేస్తూ లాభాలను పొందాలని అనుకుంటూ ఉంటారు.కానీ కొంతమందికి ఏమీ చేసినా నష్టాల పాలవుతుంటారు. ఇలాంటి వారు వారి సమస్యను తీర్చుకోవడానికి తమలపాకులతో ఆంజనేయ స్వామిని పూజించడం వల్ల, తీరుతాయని వేద పండితులు సూచిస్తున్నారు.

శాస్ట్రాల ప్రకారం, వ్యాపారాలలో లాభాలు వచ్చి, కుటుంబంలో ఆనందం, శాంతి , అదృష్టాన్ని తీసుకువచ్చేందుకు  తమలపాకులతో కొన్ని పరిష్కారాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం..

1.తమలపాకులతో ఆంజనేయుడి అనుగ్రహం పొందవచ్చని వేద పండితులు చెబుతున్నారు.దాని కోసం ప్రతి మంగళవారం లేదా శనివారం రోజున తలస్నానం చేసి, ఇళ్ళు వాకిలి శుభ్రం చేసుకొని,, హనుమంతుని ఆలయంలో టెంకాయ, పసుపు కుంకుమలతో పాటు తాంబూలం తయారుచేసిన పాన్ దేవుడికి ప్రసాదంగా సమర్పించాలి. ఇలా పెట్టడం వల్ల, ఆంజనేయ అనుగ్రహం కలిగి వ్యాపార శక్తి పెరుగుతుందని చెబుతారు.

2.తమలపాకులకు ద్రుష్టి దోషాలను పోగొట్టే శక్తి ఉందని జ్యోతిష్యశాస్త్రం చెబుతోంది.శివున్ని కూడా తమలపాకులతో పూజించడం చాలా  మంచిది,ఎందువలన అంటే శివుడికి తమలపాకులు ప్రసాదంగా పెట్టడం వల్ల శివుడు ప్రసన్నుడవుతాడని, భక్తుల కోర్కెలు తీరుస్తాడని ప్రజల నమ్మకం.ఈ పాన్ ను గుల్కంద, తమలపాకులు, సోంపు, ఖర్జురం గుజ్జు కలిపి పాన్ కట్టి దేవుడికి సమర్పించాలి. దీనితో వ్యాపారం పై వున్న ద్రుష్టి దోషాలు తొలుగుతాయి.మరియు వ్యాపారం విస్తరించాలనుకుంటే,మంగళవారం ఉదయాన్నే ఎవరూ చూడక మునుపే 5 మిరపకాయలు మరియు 8  తమలపాకులను ఒక దారంపై కట్టి, మీ షాప్ కు తూర్పు వైపున కట్టాలి.ఇలా వరుసగా 5 మంగళవారాలు కట్టాలి. ఇలా వాడిన ఆకులను తొక్కని ప్రదేశంలో పడేయాలి. ఇలా చేయడం వల్ల నెగటివ్ ఎనర్జీ వెళ్ళిపోయి, వ్యాపార విస్తరణ జరుగుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: