టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ శ్రీలంకతో ద్వైపాక్షిక టీ20 సిరీస్కు దూరంగా వుండి .. ప్రస్తుతం ఫ్యామిలీతో ఆనందంగా గడుపుతున్నాడు. రోహిత్ తమ ఫ్యామిలీ గురించి ఈ క్రమంలోనే గతేడాది జరిగిన వన్డే వరల్డ్కప్లో మీడియా పెద్ద చేసి చూపడంపై ఆగ్రహం వ్యక్తం చేశాడు.
అసలు మీడియా తమ ఫ్యామిలీల గురించి ఎందుకు ఆసక్తి చూపుతుందంటూ ప్రశ్నించాడు. ఏమైనా చెప్పాలనుకుంటే తమ గురించి చెప్పాలి మా గురించి మాత్రమే రాయాలని, అంతే తప్ప ప్రతీ విషయంలో కుటుంబాన్ని లాగడం మంచి పద్ధతి కాదంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశాడు.వరల్డ్కప్ సమయంలో చోటు చేసుకున్న వివాదం గురించి రోహిత్ పెదవి విప్పాడు. ‘ మా ఫ్యామిలీలు మాకు అన్ని విషయాలలో అండగా ఉంటాయి.
వారు ఎప్పుడు మమ్మల్ని సంతోషంగా ఉంచే క్రమంలో మాతో ఉంటే అందులో తప్పేముంది . మా కుటుంబ సభ్యులు నిర్ణయించిన రోజుల కంటే ఎక్కువ రోజులు మాతో ఉన్నారని పలు రకాలుగా వార్తలు రాశారు. ఇక్కడ మా ఫ్యామిలీల గురించి ఎందుకు. మా కుటుంబల గురించి రాస్తున్నారని స్నేహితులు చెబితే నవ్వుకున్నా. ఇప్పుడు ఒక విషయం చెప్పదల్చుకున్నా. ఒకవేళ నా గురించి ఏమైనా చెప్పాలనుకుంటే అది నాకే పరిమితం చేయండి. ఫలానా వాళ్లు మా గురించి ఏదో అంటున్నారని రాస్తే దాన్ని మేము లెక్కచేయాల్సిన పనిలేదు అంటూ రోహిత్ తెలియజేసారు .
ఇప్పటికే ఇదే విషయంపై విరాట్ కోహ్లి కూడా స్పష్టత ఇచ్చాడు. మా జీవితంలో కుటుంబాలు అనేవి కూడా చాలా ముఖ్యమైనవనే సంగతి గుర్తుంచుకోవాలి’ అని రోహిత్ పేర్కొన్నాడు. గతేడాది ఓపెనర్గా ఒక క్యాలెండర్ ఇయర్లో అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక పరుగులు సాధించిన రికార్డును రోహిత్ సాధించాడు. ఈ క్రమంలోనే 22 ఏళ్ల పాటు పదిలంగా ఉన్న శ్రీలంక మాజీ ఓపెనర్ సనత్ జయసూర్య రికార్డును బ్రేక్ చేశాడు.