క్రికెట్ ప్రేక్షకులందరూ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఐపీఎల్ ఇంకొన్ని రోజుల్లో ప్రారంభం కాబోతున్న విషయం తెలిసిందే. కరోనా  వైరస్ ప్రభావం కారణంగా ఈ ఏడు యూఏఈ వేదికగా ఐపీఎల్ 2020  జరగనుంది.  ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి అవగా.. అన్ని జట్ల ఆటగాళ్లు కూడా యూఏఈ చేరుకున్నారు. అయితే మొదటి నుంచి సిఎస్కే జట్టుకు వరుస షాకులు తగులుతున్న విషయం తెలిసిందే. సీఎస్కే జట్టు లో కరోనా కలకలం రేపడం.. తర్వాత సీఎస్కే జట్టు నుంచి స్టార్ ఆటగాడు సురేష్ రైనా తప్పుకోవటం  ఇలా వరుస షాకులు తగులుతున్నాయి.



 రైనా ఐపీఎల్ నుంచి తప్పుకోవడంపై ఎన్నో రూమర్స్  కూడా వినిపిస్తున్నాయి.. కరోనా  వైరస్ కి భయపడి తప్పుకున్నాడని కొంతమంది.. తనకు నచ్చిన రూమ్  ఇవ్వకపోవడంతోనే రైనా తప్పుకున్నాడు అని మరికొంతమంది.. ఇలా ఎన్నో రూమర్స్ కూడా వస్తున్నాయి. అయితే ఎన్నో ఏళ్ల నుంచి ఐపీఎల్లో స్టార్ ఆటగాడిగా కొనసాగుతున్న రైనా తప్పుకోవడం సీఎస్కే కి భారీ షాక్ అనే చెప్పాలి. ఇక సిఎస్కే నుంచి తప్పుకున్న రైనా భారీగానే నష్టపోనున్నాడు అన్నది తెలుస్తుంది. ఐపీఎల్ ఆరంభ సీజన్లో సుమారు నాలుగు కోట్లకు రైనా ను కొనుగోలు చేసిన చెన్నై సూపర్ కింగ్స్... 2018 నుంచి 11 కోట్ల వరకు చెల్లిస్తోంది. ఐపీఎల్  నుంచి తప్పుకున్న  రైనా 11 కోట్ల వరకు నష్టపోనున్నాడు.


అంతేకాకుండా మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్, బెస్ట్ క్యాచ్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డుల రూపంలో కూడా ఐపీఎల్లో రైనా భారీగానే సంపాదించేవాడు. ఈ ఏడాది ఐపీఎల్ నుంచి తప్పుకోవడం కారణంగా రైనా 15 కోట్ల వరకు చేజార్చుకున్నట్లు  వార్తలు వస్తున్నాయి. చెన్నై జట్టులో ధోని  తర్వాత అత్యధిక ఆదరణ కలిగిన క్రికెటర్ గా ఉన్న  సురేష్ రైనా... ఐపీఎల్ నుంచి ఉన్నఫలంగా నిష్క్రమించడంతో రైనా పై  వచ్చే సీజన్లో వేటు పడే అవకాశం ఉంది అనే టాక్ కూడా వినిపిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: