టీ-20 ఫార్మెట్లో క్రిస్ గేల్ ఒక అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. ఏకంగా ఇప్పటివరకు 1000 సిక్సర్లు బాదిన ఏకైక క్రికెటర్ గా వెస్టిండీస్ దిగ్గజం క్రిస్ గేల్ రికార్డు సృష్టించాడు. 41 ఏళ్ల వయసు దాటిపోతే కూడా ఎక్కడా వెనక్కి తగ్గకుండా భారీ సిక్సర్లు కొడుతూ అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నాడు క్రిస్ గేల్. ఇక ఇటీవలే రాజస్థాన్ రాయల్స్ కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్ల మధ్య మ్యాచ్ జరిగిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ జట్టుకు కె.ఎల్.రాహుల్ అవుట్ కావడంతో నిరాశే ఎదురైంది. ఇక ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన క్రిస్ గేల్ సృష్టించిన విధ్వంసం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది.
ఎలాంటి బాల్ వేసిన దానిని సిక్సర్ గా మలుస్తూ బౌలర్ల వెన్నులో వణుకు పుట్టించాడు క్రిస్ గేల్. దీంతో క్రిస్ గేల్ కి ఎలా బోలింగ్ చేయాలో కూడా అర్థం కాక అయోమయంలో మునిగిపోయారు రాజస్థాన్ రాయల్స్ బౌలర్లు. ఈ క్రమంలోనే నిన్న భారీగా సిక్సర్లు బాది ప్రపంచ క్రికెట్ చరిత్రలో వెయ్యి సిక్సర్లు బాదిన ఏకైక క్రికెటర్ గా అరుదైన రికార్డు సృష్టించాడు క్రిస్ గేల్. రికార్డులో క్రిస్ గేల్ ను అందుకోవడానికి వేరే ఆటగాడు దరిదాపుల్లో కూడా లేకపోవడం గమనార్హం.. 690 సిక్సర్లతో కిరణ్ పోలార్డ్ రెండవ స్థానంలో కొనసాగుతున్నాడు. 41 ఏళ్ల క్రిస్ గేల్ ఏకంగా ఐపీఎల్ లోనే 129 ఇన్నింగ్స్ లో 341 సిక్సర్లు బాదాడు.