కానీ బిసిసిఐ అప్పటికి కూడా రోహిత్ శర్మను ఆస్ట్రేలియా పర్యటన కోసం ఎంపిక చేయకపోవడం పై తీవ్ర స్థాయిలో విమర్శలు కూడా వచ్చాయి. ఈ క్రమంలో బిసిసిఐ ఎట్టకేలకు వెనక్కి తగ్గి ఆస్ట్రేలియా పర్యటనలో టెస్ట్ సిరీస్ కోసం రోహిత్ శర్మను ఎంపిక చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఇక ఇప్పుడు రోహిత్ శర్మ నేషనల్ క్రికెట్ అకాడమీ లో ఫిట్నెస్ ట్రైనింగ్ పొందుతున్నాడు అని బీసీసీఐ చెబుతోంది. అయితే దీనిపై కూడా స్పష్టత ఇవ్వడంలేదు ఇటీవలే రోహిత్ శర్మ పూర్తిస్థాయి ఫిట్నెస్ సాధించలేదు అని బీసీసీఐ వర్గాలు చెప్పాయి. దీంతో ఆస్ట్రేలియా టెస్ట్ సిరీస్కు దూరమయ్యే అవకాశం ఉంది అనే వాదనలు కూడా వినిపించాయి.
అయితే తాజాగా ఇదే విషయంపై టీమ్ ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రోహిత్ శర్మ గాయం పరిస్థితిపై ప్రస్తుతం భారత క్రికెట్ లో గందరగోళ పరిస్థితి నెలకొంది అంటూ వ్యాఖ్యానించాడు విరాట్ కోహ్లీ. రోహిత్ శర్మ గాయం పై ఎలాంటి స్పష్టత లేదు అంటూ వ్యాఖ్యానించాడు. రోహిత్ శర్మ ఇశాంత్ శర్మ లు పూర్తిగా ఫిట్నెస్ సాధించి కోలుకుంటే ఆస్ట్రేలియా టెస్ట్ మ్యాచ్ ఆడొచ్చు అంటూ చెప్పుకొచ్చాడు. ముంబై తో కలిసి రోహిత్ ఐపీఎల్ మ్యాచ్ ఆడాడు కాబట్టి ఇక ఆస్ట్రేలియా పర్యటన కోసం తమతోపాటు ఫ్లైట్ ఎక్కుతాడు అనుకున్నానని కానీ అతను మాత్రం రాలేదు అంటూ చెప్పుకొచ్చాడు. తర్వాత అతడు నేషనల్ క్రికెట్ అకాడమీ లో ఫిట్నెస్ ట్రైనింగ్ తీసుకుంటున్నాడు అన్న విషయం తెలిసింది అంటూ చెప్పుకొచ్చాడు. ఒకవేళ రోహిత్ శర్మ కోలుకుంటే క్రికెట్ ఆడేందుకు రావచ్చు అంటూ చెప్పుకొచ్చాడు విరాట్ కోహ్లీ.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి