అయితే విరాట్ కోహ్లీ సెంచరీ చేసి దాదాపు ఏడాదిన్నర పూర్తవుతుంది. ఇక ఇంగ్లాండ్ సౌతాంప్టన్ వేదికగా న్యూజిలాండ్తో జరిగిన ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్లో కూడా భారీ అంచనాలతో బరిలోకి దిగిన కోహ్లీ కేవలం రెండు ఇన్నింగ్స్ లో 57 పరుగులు మాత్రమే చేయగలిగాడు. ఎప్పుడు జట్టు విజయంలో కీలకపాత్ర వహించే కోహ్లీ చివరికి తడబడ్డాడు. దీంతో భారత జట్టు 8 వికెట్ల తేడాతో ఓటమి చవిచూసింది. ఈ క్రమంలోనే కెప్టెన్ కోహ్లి బ్యాట్మెన్గా.. కెప్టెన్గా కూడా విఫలం అయ్యాడు అంటూ ఎంతో మంది విమర్శలు చేస్తున్నారు. కెప్టెన్సీ నుంచి తప్పుకోవాలంటూ డిమాండ్స్ కూడా తెర మీదకు వస్తున్నాయి.
అయితే 2019 నవంబర్ లో సెంచరీ నమోదు చేసిన కోహ్లీ ఇప్పటివరకు ఒక్క సెంచరీ కూడా చేయలేక పోయాడు. ఇక ఈ ప్రభావం టీమిండియాపై ఎక్కువగా పడుతుంది. అయితే తాజాగా టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ బ్యాటింగ్ తీరుపై మాజీ బ్యాటింగ్ కోచ్ సంజయ్ బంగర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇప్పటివరకు టెస్టు లో విరాట్ కోహ్లీ 7547 పరుగులు చేశాడు. వన్ డే, టీ20ల్లో కూడా అద్భుతంగా రాణిస్తున్నాడు. కానీ మిగతా ఫార్మట్ తో పోలిస్తే టెస్టుల్లో ఆడటం కష్టం.. ఇక ఇప్పుడు మారిన పరిస్థితుల్లో పరుగులు చేయడం మరింత కష్టం.. అందుకే కోహ్లీకి ప్రస్తుతం సవాళ్లు ఎక్కువవుతున్నాయి. అయితే కోహ్లీ సెంచరీ కరువుకి ఇప్పటికైనా స్వస్తి చెప్పడం బెటర్ అంటూ సూచించాడు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి