టీమిండియా జోరుకు కళ్లెం వేయలేక పోయిన శ్రీలంక జట్టుకు సొంతగడ్డపైనే షాక్ తగిలింది. ఇక చివరికి మూడో వన్డే మ్యాచ్ గెలిచి పరువు నిలబెట్టుకుంది. ఇటీవల శ్రీలంక టి20 సిరీస్ కూడా ప్రారంభం అయింది. T20 సిరీస్ లో కూడా యువ ఆటగాళ్లు అదే రీతిలో విజృంభించారు. అద్భుతంగా రాణించారు. దీంతో శ్రీలంక జట్టుపై మొదటి టి20 సిరీస్ లో ఘన విజయాన్ని సాధించింది టీమిండియా జట్టు. కాగా నేడు టి20 సిరీస్ లో భాగంగా రెండవ t20 మ్యాచ్ జరగబోతోంది. ఇక ఈ టి 20 మ్యాచ్ కూడా టీమిండియా గెలుచుకుని ఇక సిరీస్ కైవసం చేసుకుంటుంది అని ప్రస్తుతం అందరూ అనుకుంటున్నారు.
అయితే ఈ ఏడాది చివర్లో టి20 వరల్డ్ కప్ జరగాల్సి ఉంది. ఈ క్రమంలోనే యువ ఆటగాళ్లు టీ20 లో అద్భుతంగా రాణిస్తే టి20 వరల్డ్ కప్ లో ఆడేందుకు అవకాశం దక్కించుకుంటారు. ఈ క్రమంలోనే ఇక ప్రస్తుతం శ్రీలంక టూర్ లో భాగంగా అందివచ్చిన అవకాశాన్ని ఎంతో అద్భుతంగా ఉపయోగించుకుంటున్నారు. ఇక వన్డే సిరీస్లో లాగానే ప్రస్తుతం టీ20 సిరీస్ లో కూడా ఒక మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ను కైవసం చేసుకోవాలని చూస్తుంది టీమిండియా. తొలి మ్యాచ్ లో శిఖర్ ధావన్, సూర్యకుమార్ యాదవ్ , బౌలర్ భువనేశ్వర్ కుమార్ ఆకట్టుకున్నారు. మరి నేడు జరగబోయే మ్యాచ్ లో ఎవరు సూపర్ హీరోగా మారబోతున్నారు అన్నది కూడా ఆసక్తికరంగా మారిపోయింది.