నిన్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ 14వ సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు తమ 9వ ఫైనల్ మ్యాచ్ ఆడిన విషయం తెలిసిందే. అయితే ఈ ఒక్క మ్యాచ్ తో చెన్నై సూపర్ కింగ్స్ జట్టులోని ఆటగాళ్ళు తమ మైలురాళ్లను చేరుకున్నారు. అయితే మొదట ఎంఎస్ ధోని ఇండియన్ ప్రీమియర్ లీగ్ జరుగుతున్న టీ-20 ఫార్మెట్లో కెప్టెన్ గా తన 300 మ్యాచ్ ను నిన్న పూర్తిచేశాడు. అయితే మొత్తం కెరీర్లో 318 టీ20 మ్యాచ్ లు ఆడిన ధోనీ అందులో మూడు వందల మ్యాచ్లకు నాయకత్వం వహించి చాలా అరుదైన రికార్డును నెలకొల్పాడు.

అనంతరం భారత స్టార్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా నిన్న కోల్ కతా నైట్ రైడర్స్ తో జరిగిన ఫైనల్ మ్యాచ్ తో ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో తన 200వ మ్యాచ్ ను పూర్తి చేసుకున్నాడు. అయితే ఈ రెండు వందల మ్యాచ్లో బ్యాటింగ్ చేసే అవకాశం జడేజాకు రాకున్నా... ఫిల్డింగ్ అలాగే బౌలింగ్లోనూ అదరగొట్టాడు. ఇక భారత బ్యాట్స్మెన్ అంబటి రాయుడు కూడా నిన్నటి మ్యాచ్ లో ఓ రికార్డు నెలకొల్పాడు. నిన్న ఐపీఎల్ 2021 ఫైనల్ మ్యాచ్ అంబటి రాయుడు ఐపీఎల్ కెరియర్ లో 175వ ఐపీఎల్ మ్యాచ్. అయితే రాయుడికి కూడా ఈ మ్యాచ్లో బ్యాటింగ్ చేసే అవకాశం రాలేదు.

ఇక చివరగా సౌత్ ఆఫ్రికా స్టార్ ఆటగాడు డుప్లెసిస్ నిన్నటి ఫైనల్ మ్యాచ్ తో ఐపీఎల్ కెరియర్ లో 100 మ్యాచ్ లను పూర్తి చేసుకున్నాడు. అయితే ఈ మ్యాచ్లో ఓపెనర్ గా వచ్చిన డుప్లెసిస్ 59 బంతుల్లో 86 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. అయితే ఇలా ఒకే మ్యాచ్ లో నలుగురు ఆటగాళ్లు వివిధ స్థాయిల్లో ఉన్న తమ మైలురాళ్లను చేరుకోవడం ఇదే మొదటిసారి. ఈ అరుదైన ఘటన ఫైనల్స్ లో జరగడం ఇంకా గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి:

csk