ప్రపంచ క్రికెట్ ప్రేక్షకులందరూ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న టి20 వరల్డ్ కప్ వచ్చేసింది. ఈ క్రమంలోనే హోరాహోరీగా మ్యాచ్ లలో తలపడేందుకు అని జట్లు సిద్ధమైపోయాయ్. ఇప్పటికే ప్రాక్టీస్ లో మునిగి తేలిన జట్లు ఇక ఇప్పుడు ప్రత్యర్థులతో తలపడేందుకు సిద్ధమవుతున్నాయి. ఇక అన్ని జట్ల కన్ను కూడా వరల్డ్ కప్ గెలవడం పైనే ఉంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ముఖ్యంగా ఈ సారి టీమిండియా కప్పు గెలవాలి అనే కసితో బరిలోకి దిగుతోంది. ఇక ప్రస్తుతం టీమిండియా వరుస విజయాలతో దూకుడు మీద కూడా ఉండటం గమనార్హం. ఈ క్రమంలోనే టీమిండియా ఈసారి వరల్డ్ కప్ గెలవడం ఖాయం అని ఎంతో మంది మాజీ క్రికెటర్లు సైతం అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.



 ఈ వరల్డ్ కప్ లో హాట్ ఫేవరెట్గా రంగంలోకి దిగుతుంది టీమిండియా జట్టు. అయితే ఇక టి20 వరల్డ్ కప్ లో భాగంగా టీమిండియా జట్టు మొదటి మ్యాచ్ పాకిస్థాన్ తోనే ఆడుతూ ఉండటం గమనార్హం. సాధారణంగానే పాకిస్తాన్ భారత్ మ్యాచ్ అంటే హై వోల్టేజీ మ్యాచ్ గా కొనసాగుతూ ఉంటుంది. క్రికెట్ చూస్తున్న ప్రేక్షకులకు మాత్రమే కాదు మైదానం లో ఆడుతున్న ఆటగాళ్లలో కూడా అంతే కసి ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో మ్యాచ్ గెలవాలని భావిస్తూ ఉంటారు. అంతేకాదు పాకిస్తాన్తో మ్యాచ్ జరిగితే ఇక ఆ మ్యాచ్ లో ఆడి అద్భుతమైన ప్రతిభ కనబర్చాలి అని భావిస్తూ ఉంటారు ఆటగాళ్లు. కాగా రేపు పాకిస్తాన్ భారత్ మధ్య మ్యాచ్ జరగబోతోంది అన్న విషయం తెలిసిందే.



 ఈ క్రమంలోనే అందరూ ఈ మ్యాచ్ కోసం ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. అయితే రేపు పాకిస్తాన్తో టీమిండియా తలబడ పోయే మ్యాచ్లో టీమిండియాలో మిస్టరీ స్పిన్నర్ గా పేరున్న వరుణ్ చక్రవర్తి దూరం అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. బీసీసీఐ మొదట వరుణ్ చక్రవర్తిని జట్టులోకి తీసుకుంది. కానీ ఇటీవలే వరుణ్ చక్రవర్తికి గాయం కావడంతో అతనికి కొన్ని మ్యాచ్ ల వరకు విశ్రాంతి ఇవ్వాలని నిర్ణయించింది  తప్పక గెలవాల్సిన మ్యాచులో ఆడించడం ద్వారా వరుణ్ చక్రవర్తి ట్రంప్ కార్డు కోసం వినియోగించాలని భావిస్తోంది బీసీసీఐ. ఈ నేపథ్యంలో రేపు జరగబోయే మ్యాచ్ లో వరుణ్ చక్రవర్తి ఉండడం డౌటే అంటున్నారు విశ్లేషకులు.

మరింత సమాచారం తెలుసుకోండి: