ద‌క్షిణాఫ్రికా ప‌ర్య‌ట‌న‌లో సెంచూరియ‌న్ టెస్ట్‌లో నెగ్గిన భార‌త్ రెండ‌వ మ్యాచ్‌లో ప‌రిస్థితి దారుణంగా మారిన‌ది. కేవ‌లం 240 ప‌రుగుల ల‌క్ష్యాన్ని మాత్ర‌మే నిర్దేశించిన‌ద‌.ఇప్ప‌టికే ద‌క్షిణాఫ్రికా బుధ‌వారం రెండు వికెట్ల న‌ష్టానికి 118 ప‌రుగులను చేసింది. విజ‌యానికి చాలా ద‌గ్గ‌ర‌య్యాడు. అయితే ఈ మ్యాచ్‌లో భార‌త్ పూర్తిగా నిష్క్ర‌మించ‌లేదు అని, నాలుగవ రోజు విజ‌యం సాధించే అవ‌కాశ‌ముంద‌ని భార‌త బ్యాట్స్‌మెన్ చ‌టేశ్వ‌ర్ పుజారా పేర్కొంటున్నాడు. నాలుగ‌వ రోజు ఆట ముగిసిన స‌మ‌యానికి ద‌క్షిణాఫ్రికా విజ‌యానికి 122 పుజారా ప‌రుగులు వెనుక‌బ‌డి ఉన్న‌ది. అయితే క్రీజుల‌క్ష కెప్టెన్ డీన్ ఎల్గ‌ర్ 46 ప‌రుగులు, రోసీ వాన్ డెర్ డ‌స్సెన్ 11 ప‌రుగుల‌తో ఆడుతున్నారు. టీమిండియా త‌రుపున శార్దూల్ ఠాకూర్ ర‌విచంద్ర‌న్ అశ్విన్ చెరొక వికెట్ తీసారు.

పుజారా వివ‌రించిన ప్ర‌కారం.. మ్యాచ్‌లో నాలుగ‌వ రోజు మొద‌టి గంటే చాలా కీల‌కం. మూడ‌వ రోజు ఆట ముగిసిన అనంత‌రం విలేక‌ర్ల స‌మావేశానికి వ‌చ్చిన పుజారా మాట్లాడారు. పిచ్‌పై హెవీ రోల‌ర్ ను ప‌రిత్తించిన తీరు కాస్త ఊర‌ట‌నిచ్చింది. మ‌ళ్లీ పిచ్ ప‌గుళ్లు రావ‌డానికి స‌మ‌యం ప‌డుతుంది. గంట త‌రువాత క‌చ్చితంగా పిచ్‌పై అస‌మాన బౌన్స్ ఉంటుంది. ఈ ప‌రిస్థితిలో ప్రారంభంలో గంట జాగ్ర‌త్త‌గా ఆడడం చాలా ముఖ్య‌మ‌ని పేర్కొన్నారు. ద‌క్షిణాఫ్రికా కెప్టెన్ డీన్ ఎల్గ‌ర్ వికెట్ కూడా చాలా ముఖ్య‌మైన‌ది పుజారా పేర్కొన్నారు.

వెన్నునొప్పి కార‌ణంగా ద‌క్షిణాఫ్రికాతో జ‌రిగిన రెండ‌వ టెస్ట్‌కు దూర‌మైన కెప్టెన్ విరాట్ కోహ్లీ గ‌తంలో కంటే మెరుగుగా ఉన్నాడ‌ని.. త్వ‌ర‌లోనే పూర్తి ఫిట్‌నెస్ ను పుంజుకుంటున్నాడ‌ని తెలిపారు పుజారా. అధికారికంగా నేను మ‌రిన్నీ విష‌యాల‌ను వెల్ల‌డించ‌లేన‌ని.. కోహ్లీ ఇప్పుడు క‌చ్చిత‌మైన మెరుగైన స్థితిలో ఉన్నాడు. త్వ‌ర‌లో ఫిట్ అవుతాడని నేను భావిస్తున్నట్టు పుజారా చెప్పారు. వెన్నునొప్పి కార‌ణంగా కోహ్లీ రెండ‌వ టెస్ట్‌కు దూరం అయ్యాడు. అత‌ని స్థానంలో కే.ఎల్‌. రాహుల్ కెప్టెన్సీ బాధ్య‌త‌లు తీసుకున్నారు. కోహ్లీ ఫిట్‌నెస్‌పై జ‌ట్టు ఫిజియో క‌చ్చిత‌మైన స్థితిని చెప్ప‌గ‌ల‌డు అని పుజారా అభిప్రాయం వ్య‌క్తం చేశాడు.


మరింత సమాచారం తెలుసుకోండి: