ఆ తర్వాత భారత్ వేదికగా సౌతాఫ్రికా తో ఆడిన టి20 సిరీస్ లో రోహిత్ శర్మ ఆడుతాడు అని అందరూ భావించారు. కానీ బిసిసిఐ సెలెక్టర్లు అతనికి విశ్రాంతి ఇవ్వడంతో మరోసారి అభిమానులకు నిరాశ తప్పలేదు. ఇక ఇంగ్లండ్ పర్యటనలో టీమిండియా ఆడబోయే కీలకమైన టెస్టు మ్యాచ్లో రోహిత్ శర్మ కెప్టెన్సీ తో పాటు అటు బ్యాటింగ్తో కూడా అదరగొడతాడు అని ఎన్నో ఆశలు పెట్టుకున్నారు అభిమానులు. కానీ అక్కడ నిరాశే ఎదురైంది. కరోనా వైరస్ బారిన పడిన రోహిత్ శర్మ జట్టుకు దూరమయ్యాడు. ఐసోలేషన్ కే పరిమితమయ్యాడు. దీంతో అతను కోలుకొని కనీసం టి20 సిరీస్కు అయినా అందుబాటులో కి వస్తాడా లేదా అని అప్డేట్ కోసం ఎదురుచూస్తూ ఉన్నారు అభిమానులు.
ఇలాంటి సమయంలో రోహిత్ శర్మ తన అభిమానులందరికీ కూడా అదిరిపోయే గుడ్ న్యూస్ అందింది అన్నది అర్థమవుతుంది. కరోనా వైరస్ బారినపడి ఐసోలేషన్ లో చికిత్స పొందుతున్న రోహిత్ శర్మ ఇటీవలే కరోనా నుండి కోలుకున్నాడు. తాజాగా జరిగిన టెస్టులో అతడికి నెగిటివ్ వచ్చినట్లు స్పోర్ట్స్ టాక్ అనే వెబ్సైట్ వెల్లడించడం గమనార్హం. దీంతో ఇక జూలై 7వ తేదీ నుంచి ఇంగ్లాండ్తో జరగబోయే టీ20 సిరీస్ లో రోహిత్ శర్మ అందుబాటులోకి రాబోతున్నాడు. జూన్ 26వ తేదీన వైరస్ బారిన పడిన రోహిత్ శర్మ ఐదో టెస్టు దూరమయ్యాడు. కాని గత ఏడాది జరిగిన నాలుగు టెస్ట్ లలో మాత్రం ఒక సెంచరీ 2 హాఫ్ సెంచరీలతో ఆకట్టుకున్నాడు. ఇక రోహిత్ శర్మ టి20 సిరీస్ ఆడబోతున్నాడు అని తెలియడంతో అభిమానులు ఆనందంలో మునిగిపోయారు.