మొదటి రెండు మ్యాచ్లలో తక్కువ పరుగులకే ఆలౌటైన జింబాబ్వే జట్టు మూడో మ్యాచ్లో మాత్రం భారత తమ ముందు ఉంచిన భారీ టార్గెట్ ను ఊహించని రీతిలో చేదించేలా కనిపించింది. కానీ చివర్లో తడబడటంతో ఇక 13 పరుగుల తేడాతో జింబాబ్వే జట్టు పరాజయం పాలైంది అని చెప్పాలి. ఇకపోతే జింబాబ్వే 3- 0 తేడాతో క్లీన్ స్వీప్ చేసింది టీమిండియా. ఇలాంటి సమయంలోనే యువ ఆటగాడు శుభమాన్ గిల్ కీలకమైన సెంచరీ చేసి అదరగొట్టాడు అనే విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే పలు రికార్డులను బ్రేక్ చేశాడు. గత కొంతకాలం నుంచి అత్యుత్తమ ప్రదర్శన కనబరుస్తున్న శుభమాన్ గిల్ మొదటి వన్డే సెంచరీ సాధించి భారత క్రికెట్ లో ఒక అరుదైన రికార్డును సృష్టించాడు.
అతి పిన్న వయసులో వన్డే ఫార్మాట్ లో సెంచరీ చేసిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. రోహిత్ శర్మ తొలి సెంచరీ 23 ఏళ్ల 28 రోజుల వయసులో చేయగా ఇప్పుడు శుభమాన్ గిల్ తన తొలి సెంచరీ 22 ఏళ్ళ 348 రోజులకు అందుకున్నాడు. ఇక అంతే కాదు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ రికార్డును కూడా బ్రేక్ చేశాడు శుభమాన్ గిల్. జింబాబ్వేపై అత్యధిక స్కోరు 136 బంతుల్లో 127 పరుగులు. అయితే శుభమాన్ గిల్ మాత్రం మెరుపు ఇన్నింగ్స్ తో 97 బంతుల్లోనే 130 పరుగులు చేసి అరుదైన రికార్డు క్రియేట్ చేశాడు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి