ఆ తర్వాత పుజారా మరియు కోహ్లీలు (19) కలిసి మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడుతూ మ్యాచ్ ను 258 పరుగుల వద్ద డిక్లేర్ చేశారు. అయితే ఫస్ట్ డౌన్ బ్యాట్స్మన్ ఛతేశ్వర్ పుజారా ఈ మధ్యన ఫామ్ కోల్పోయి టెస్ట్ లలో ఆడడానికి కూడా చాలా ఇబ్బంది పడేవాడు. కానీ ఈ మ్యాచ్ లో మొదటి ఇన్నింగ్స్ లో ఎంతో విలువైన 80 పరుగులు చేశాడు. ఇక రెండవ ఇన్నింగ్స్ లో అయితే పుజారా ఇన్నింగ్స్ హైలైట్ అని చెప్పుకోవాలి. పుజారాకు గత 52 టెస్ట్ ఇన్నింగ్స్ లుగా సెంచరీ లేదు.. ఇన్నాళ్లూ సెంచరీ లేని లోటును ఈ రోజుతో పూర్తి చేసుకున్నాడు. పుజారా 130 బంతుల్లో 102 పరుగులు చేసి తన కెరీర్ లో ఫాస్టెస్ట్ సెంచరీ ని నమోదు చేశాడు. ఇతని ఇన్నింగ్స్ లో మొత్తం 13 ఫోర్లు ఉండడం గమనార్హం.
పుజారా సెంచరీ ముగియగానే ఇండియా తన ఇన్నింగ్స్ ను డిక్లేర్ చేసింది. ప్రస్తుతం బంగ్లా లక్ష్యం 472 పరుగులు. మరి ఇంతటి భారీ లక్ష్యాన్ని బంగ్లాదేశ్ చేధించగలదా అంటే... ఖచ్చితంగా కష్టమే అని చెప్పాలి. కానీ ఎన్ని పరుగులు సాధించి ఇండియా బౌలర్లను సమర్దవంతంగా ఎదుర్కోగలదు అన్నది చూడాలి. ప్రస్తుతం క్రీజులో జాకీర్ హుస్సేన్ 19 మరియు శాంటో 22 పరుగులతో ఉన్నారు. ఆటముగిసే సమయానికి బంగ్లా వికెట్ నష్టపోకుండా 513 పరుగులు చేసింది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి