టీమిండియా అటు శ్రీలంకతో టి20 సిరీస్ ఆడింది అన్న విషయం తెలిసింది టి20 సిరీస్ లో భాగంగా మొదటి మ్యాచ్ లో విజయం సాధించింది   కానీ రెండవ మ్యాచ్లో మాత్రం ఓడిపోయింది అన్న విషయం తెలిసిందే. కాగా హార్దిక్ వ్యూహాలపై తీవ్రస్థాయిలో విమర్శలు వస్తూ ఉన్నాయి అని చెప్పాలి   ముఖ్యంగా ఎంతో అనుభవజ్ఞుడు అయినా హార్దిక్ పాండ్యా స్వయంగా బౌలింగ్ వేయడానికి రాకుండా అప్పుడే భారత జట్టులోకి అరంగేట్రం చేసిన యువ ఆటగాడు శివమ్ మావికి బౌలింగ్ అప్పగించడంతో అందరూ షాక్ అయ్యారు.


 ఈ క్రమంలోనే కీలకమైన ఓవర్లలో ఒత్తిడిని అధిగమించలేకపోయిన శివమ్ మావి భారీగా పరుగులు సమర్పించుకున్నాడు అని చెప్పాలి. అయితే హార్దిక్ పాండ్యా  తీసుకున్న ఈ నిర్ణయం పై ఎంతో మంది మాజీ ఆటగాళ్లు స్పందిస్తూ ఉన్నారు అని చెప్పాలి   అయితే డెత్ ఓవర్లలో హార్దిక్ పాండ్యా బౌలింగ్ చేయకుండా తప్పు చేశాడు అంటూ మాజీ ఆటగాడు వసీం జాఫర్ స్పందించాడు  ఒక స్పోర్ట్స్ ఛానల్ తో జరిగిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. నిజానికి శివమ్ మావికి డెత్ ఓవర్లలో మెరుగైన రికార్డు లేదు. కానీ అటు హార్దిక్ పాండ్యా మాత్రం అనుభవజ్ఞుడు.  అందుకే అతని బౌలింగ్ చేసి ఉంటే బాగుండేది అంటూ అభిప్రాయపడ్డాడు.



 ఆరో ఓవర్ తర్వాత హార్దిక్ పాండ్యా బౌలింగ్ చేయడం చూసి నేనైతే ఆశ్చర్యపోయాను అంటూ వసీం జాఫర్ చెప్పుకొచ్చాడు. అయితే మొదటి రరెండు ఓవర్లు  లేదా మిడిల్ లో రెండు ఓవర్లు వేయడంతో పాటు ఇక హార్దిక్ పాండ్యా డెత్ ఓవర్లలో మిగతా ఓవర్ల కోటాని కంప్లీట్ చేస్తాడని నేను అనుకున్నాను. కానీ హార్దిక్ పాండ్యా మాత్రం అలా చేయలేదు. ఊహించని రీతిలో డెత్ ఓవర్లలో శివమ్ మావికి బౌలింగ్ అప్పగించాడు. ఇక అంతే కాకుండా అర్షదీప్ సేవలను కూడా సరిగ్గా ఉపయోగించుకోలేకపోయాడు అంటూ వసీం జాఫర్ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: