ప్రస్తుతం టీమిండియా జట్టు వెస్టిండీస్ పర్యటనలో ఉంది అన్న విషయం తెలిసిందే. ఈ పర్యటనలో భాగంగా మూడు ఫార్మట్లలో కూడా సిరీస్ లు ఆడుతుంది. ఈ క్రమంలోనే మొదట వెస్టిండీస్ పర్యటన టెస్ట్ సిరీస్ తో ప్రారంభించిన టీమ్ ఇండియా శుభారంభం చేసింది. రెండు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ లో భాగంగా ఒక మ్యాచ్లో విజయం సాధించింది. రెండో మ్యాచ్లో కూడా విజయం సాధించే అవకాశాలు ఉన్నప్పటికీ వర్షం అంతరాయం కలిగించడంతో మ్యాచ్ డ్రాగా ముగిసింది. దీంతో టెస్ట్ సిరీస్ ను 1-0 తేడాతో కైవసం చేసుకుంది టీమిండియా. అయితే ఇదే జోరులో వన్ డే సిరీస్ ని కూడా ప్రారంభించింది.


 ఈ క్రమంలోనే వన్డే సిరీస్ లో భాగంగా మొదటి మ్యాచ్ లో ఘనవిజయాన్ని సాధించిన టీమిండియా.. ఇక నేడు రెండో మ్యాచ్ ఆడబోతుంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే భారత్, వెస్టిండీస్ మధ్య జరగబోయే రెండో వన్డే  మ్యాచ్ బార్బడోస్  వేదికగా జరుగుతూ ఉండడం గమనార్హం. ఈ క్రమంలోనే తొలి మ్యాచ్లో విజయం సాధించిన టీమ్ ఇండియా రెండో మ్యాచ్లో కూడా విజయం సాధించి ఒక మ్యాచ్ మిగిలి ఉండగానే వన్డే సిరీస్ ను కూడా కైవసం చేసుకోవాలని భావిస్తూ ఉంది. ఇక ఈ మ్యాచ్ సాయంత్రం ఏడు గంటలకు ప్రారంభమవుతుంది అని చెప్పాలి.


 అయితే ఇప్పటికే టెస్టు సిరీస్ కోల్పోవడం కాదు.. అటు మొదటి వన్డే మ్యాచ్ లో కూడా ఓడిపోయిన వెస్టిండీస్ రెండవ వన్డే మ్యాచ్లో మాత్రం గెలిచి సిరీస్ అవకాశాలను సజీవంగా ఉంచుకోవాలని చూస్తుంది అని చెప్పాలి. అయితే తొలి వన్డేలో కొత్త ఆటగాళ్లకు అవకాశం ఇచ్చినట్లుగానే.. రెండో వన్డేలో కూడా కొత్త ప్లేయర్స్ కే మరోసారి తుది జట్టులో  ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉంది అన్నది తెలుస్తుంది. ఇలా సిరీస్ కోసం కోసం టీమిండియా మరోవైపు సిరీస్ అవకాశాలను సజీవంగా ఉంచుకునేందుకు వెస్టిండీస్ నేడు హోరాహోరీగా పోరాడే అవకాశం ఉంది. ఎవరు పై చేయి సాధిస్తారో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: