రోహిత్ శర్మ తర్వాత టీమిండియా ఫ్యూచర్ కెప్టెన్ ఎవరు అంటే అందరూ హార్థిక్ పాండ్యా పేరు చెబుతున్నారు. అయితే అప్పటివరకు కెప్టెన్సీ రేస్ లో ఎక్కడా కనిపించని హార్దిక్ పాండ్యా.. పేరు ఎప్పుడైతే గుజరాత్ కెప్టెన్ గా మొదటి ప్రయత్నంలోనే టైటిల్ సాధించాడో అందరిని వెనక్కి నెట్టి ముందు వరుసలోకి వచ్చేస్తుంది. ఈ క్రమంలోనే ఇలా కెప్టెన్ హార్దిక్ పాండ్యా అంటూ ప్రచారం జరిగిందో లేదో అంతలోనే బీసీసీఐ సైతం టి20 జట్టు కెప్టెన్సీ బాధ్యతలను హార్థిక్ పాండ్యాకు అప్పగించింది. కేవలం నామమాత్రపు కెప్టెన్ గా మాత్రమే నియమించింది అని అందరూ అనుకున్నారు. కానీ విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ లాంటి సీనియర్ క్రికెటర్లను పక్కనపెట్టి టీమిండియా ఆడిన ప్రతి టి20 సిరీస్ కు పాండ్యనే కెప్టెన్ గా నియమిస్తూ వస్తుంది బీసీసీఐ.


 ఇక అతనికి కెప్టెన్సీ అద్భుతం అంటూ ఎంతో మంది మాజీలు కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఉన్నారు అని చెప్పాలి. మైదానంలో ఆటగాళ్లకు హార్థిక్ పాండ్యా స్వేచ్ఛ ఇస్తున్నాడని అతనికి కెప్టెన్సీ వ్యూహాలు కూడా బాగున్నాయి అంటూ అందరూ ప్రశంసలు కురిపిస్తూ ఉన్నారు. అయితే ఇలా కెప్టెన్ గా ఇప్పుడు వరకు ప్రశంసలు అందుకున్న హార్దిక్ ఇక ఇటీవల చేసిన పనికిమాత్రం విమర్శలు ఎదుర్కొంటున్నాడు. ప్రస్తుతం వెస్టిండీస్ పర్యటనలో హార్దిక్ పాండ్యా కెప్టెన్సీ లో బరిలోకి దిగింది టీమిండియా. అయితే  ఇటీవల  జరిగిన మూడో టి20 మ్యాచ్ లో హార్దిక్ కాస్త సెల్ఫిష్ గా ఆలోచించాడు.


 టి20 సిరీస్ లో భారత బ్యాటింగ్ విభాగం మొత్తం విఫలమవుతున్న వేళ తెలుగు క్రికెట్ తిలక వర్మ మాత్రం.. మంచి ఇన్నింగ్స్ తో ఆకట్టుకున్నాడు. మొదటి మ్యాచ్ లో 39, రెండో మ్యాచ్ లో హాఫ్ సెంచరీ, మూడో మ్యాచ్లో 49 పరుగులు చేసి కీలక ఇన్నింగ్స్ లు ఆడాడు. అయితే తిలక్ వర్మ 49 పరుగుల వద్ద హాఫ్ సెంచరీ చేసే అవకాశం ఉన్నప్పుడు కెప్టెన్ గా హార్దిక్  అతనికి స్ట్రైక్ ఇచ్చి హాఫ్ సెంచరీ చేసేందుకు అవకాశం ఇచ్చి ఉంటే బాగుండేది. కానీ ఫినిషర్ అనే పేరు తెచ్చుకునేందుకు చివర్లో సిక్సర్ కొట్టి తానే మ్యాచ్ ను ముగించాడు. దీంతో హార్థిక్ పాండ్యాపై విమర్శలు వస్తున్నాయి. యువ ఆటగాడైన తిలక్ వర్మకు హాఫ్ సెంచరీ చేసే ఛాన్స్ ఇచ్చి ఉంటే.  అతనిలో ఆత్మవిశ్వాసం మరింత పెరిగేది అంటూ ఎంతమంది క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: