గత కొంతకాలం నుంచి భారత క్రికెట్ లో తెలుగు ప్లేయర్ తిలక్ వర్మ గురించి ఎక్కువగా వినిపిస్తుంది. ఎందుకంటే ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో ముంబై ఇండియన్స్ తరఫున అదరగొట్టిన ఈ యంగ్ క్రికెటర్.. ఇక ఇటీవల టీం ఇండియాలో కూడా ఛాన్స్ దక్కించుకున్నాడు. అయితే ఐపీఎల్లో ఎలా అయితే నిలకడైనా ఆట తీరుతో ఆకట్టుకున్నాడో.. ఇక టీమ్ ఇండియా తరపున ఛాన్స్ వచ్చినప్పుడు కూడా ఎక్కడ ఒత్తిడికి లోనవ్వకుండా ఎంతో మెచ్యూరిటీతో బ్యాటింగ్ చేశాడు. అతని బ్యాటింగ్ చూసి ఏకంగా జట్టు కెప్టెన్ హార్దిక్ పాండ్యా కూడా షాక్ అయ్యాడు.


 ఎంతో అనుభవం ఉన్న ఆటగాడిలాగా అటు తిలక్ వర్మ ఆట తీరు ఉందని ప్రశంసలు కూడా కురిపించారు. ఎంతో మంది మాజీలు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అయితే ఇలా ఒత్తిడిని దరి చేరనివ్వకుండా అద్భుతంగా ఆడుతున్న తిలక్ వర్మను వెంటనే వన్డే టీంలోకి తీసుకోవాలని కుదిరితే ఆసియా కప్ తో పాటు ప్రపంచకప్ లో కూడా తిలక్ వర్మను ఆడించాలని పలువురు మాజీలు డిమాండ్ చేశారు. అయితే భారత మాజీ సెలెక్టర్ సభ కరీం మాత్రం షాకింగ్ కామెంట్స్ చేశాడు. యంగ్ క్రికెటర్ తిలక్ వర్మ విషయంలో కొంత ఓపిక పటాల్సిన అవసరం ఉంది అంటూ చెప్పుకొచ్చాడు.


 టి20 లో రాణించిన ప్లేయర్ని వన్డేలకు ఎంపిక చేయడం అన్యాయం అంటూ తెలిపారు. అలాగే కీలకమైన టోర్నీలకు జట్టును ఎంపిక చేసే సమయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు అంటూ హెచ్చరించాడు. వరల్డ్ కప్ లో కచ్చితంగా ఆడే 15 మంది బృందాన్ని ముందుగా సెలెక్టర్లు ఎంపిక చేయాలని సభా కరీం సూచించాడు. ఇక ఆ తర్వాతనే బ్యాకప్ ఆటగాళ్ల గురించి ఆలోచన పెట్టుకోవాలి అంటూ సలహా ఇచ్చాడు. గతంలో కొందరు నిపుణులు అంబటి రాయుడుని కాదని విజయ్ శంకరును వరల్డ్ కప్ లో తీసుకున్నారు. ఆ వ్యూహం పూర్తిగా బెడిసి కొట్టింది. t20 వరల్డ్ కప్ లో తొందరపడి సెలక్టర్లు వరుణ్ చక్రవర్తిని సెలెక్ట్ చేసిన అదే జరిగింది. ఇప్పుడు తిలక్ వర్మ విషయంలో కూడా ఇలాంటి తొందరపాటు వద్దు. ఎంతో ఓపికగా నిర్ణయం తీసుకోవాలి అంటూ సూచించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: