అక్టోబర్ 5వ తేదీన ఎంతో గ్రాండ్ గా ప్రారంభమైన వన్డే వరల్డ్ కప్ 2023 ఎడిషన్ ప్రస్తుతం కీలక దశకు చేరుకుంది అనే విషయం తెలిసిందే. ఎన్నో రోజుల నుంచి లీగ్ మ్యాచ్లలో అదరగొడుతూ వచ్చిన టీమ్స్.. ఇక ఇప్పుడు సెమీఫైనల్ లో అడుగు పెట్టేందుకు సిద్ధమవుతున్నాయ్. ఇప్పటికే భారత్, సౌత్ ఆఫ్రికా, ఆస్ట్రేలియా జట్లు సెమీఫైనల్ లో అడుగుపెట్టాయి. అయితే ప్రస్తుత పరిస్థితులు చూస్తూ ఉంటే అటు న్యూజిలాండ్ కూడా దాదాపుగా ఇక వరల్డ్ కప్ లో పాయింట్ల పట్టికలో నాలుగవ స్థానంలో చోటు సంపాదించుకుని సెమీఫైనల్ లో అడుగు పెట్టడం ఖాయం అనేది తెలుస్తుంది.


 ఇలాంటి సమయంలోనే ఈ వరల్డ్ కప్ ఎడిషన్ లో భాగంగా వరుస విజయాలతో దూసుకుపోతున్న భారత జట్టు ఇప్పుడు 2019 వరల్డ్ కప్ కు సంబంధించిన ప్రతీకారం తీర్చుకునేందుకు సిద్ధమైంది అంటూ ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. ఒకప్పటి టీమిండియా ప్లేయర్స్ కన్నీళ్ళకు ఇప్పుడు భారత జట్టు తప్పకుండా ప్రతీకారం తీర్చుకోవాల్సిందే అని అభిమానులు కూడా గట్టిగా ఫిక్స్ అయ్యారు. అయితే న్యూజిలాండ్ జట్టు దాదాపు నాలుగో స్థానంలో నిలిచి సెమీఫైనల్ వెళ్లడం ఖాయంగానే కనిపిస్తుంది  ఇదే జరిగితే మొదటి స్థానంలో ఉన్న భారత్ నాలుగో స్థానంలో ఉన్న న్యూజిలాండ్తో సెమి ఫైనల్ మ్యాచ్ ఆడుతుంది.


 అయితే సెమీ ఫైనల్లో ఈ రెండు టీమ్స్ మధ్య మ్యాచ్ ఉండడంతో ఇక భారత అభిమానులు 2019 వరల్డ్ కప్ నాటి చేదు జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటున్నారు. ఆ టోర్నీ లీగ్ దశలో వరుస విజయాలతో సెమిస్ చేరిన భారత్.. సెమి ఫైనల్ లాంటి కీలకమైన పోరులో మాత్రం న్యూజిలాండ్ ముందు బోల్తా పడింది. అనూహ్యంగా  ధోని రన్ అవుట్ కావడంతో కోట్లాదిమంది ఆశలు గల్లంతయ్యాయి. ధోని రన్ అవుట్ అయిన సమయంలో ధోనితో పాటు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ కూడా కన్నీటి పెట్టుకోవడం అందరిని కలిచి వేసింది. ఇక అదే వరల్డ్ కప్ లో అలాంటి సెమీస్ లోనే న్యూజిలాండ్, భారత్ జట్లు తలబడుతున్నాయ్. భారత జట్టు ప్రతీకారం తీర్చుకోవడం ఖాయం అని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: