మహమ్మద్ షమి రుతురాజ్ కైక్వాడ్ ఇషాన్ కిషన్లు ప్రస్తుతం భారత జట్టుకు దూరమయ్యారు అన్న విషయం తెలిసిందే. అయితే షమీ చీలమండ గాయంతో దూరం కాగా ఋతురాజ్ చేతి వేలికి గాయం కావడంతో జట్టు నుంచి తప్పుకున్నాడు. ఇషాన్ కిషన్ మాత్రం వ్యక్తిగత కారణాలతో జట్టు నుంచి తప్పుకున్నాడు అన్నది తెలుస్తుంది. అయితే ఇక ఆ వ్యక్తిగత కారణాలు ఏంటి అన్న విషయంపై మాత్రం ఎలాంటి స్పష్టత లేకుండా పోయింది అని చెప్పాలి. అయితే మానసికంగా అలసిపోవడం కారణంగానే ఇషాన్ కిషన్ జట్టు నుంచి తప్పుకున్నాడు అంటూ వార్తలు వచ్చాయి.
ఇక ఈ విషయంపై ఇటీవలే క్లారిటీ వచ్చింది అని చెప్పాలి. మానసికంగా చాలా అలసిపోయినట్లు ఇషాన్ కిషన్ మేనేజ్మెంట్ దృష్టికి తీసుకువెళ్లారట. క్రికెట్ నుంచి కాస్త విరామం కావాలని సెలెక్టర్లను రిక్వెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. టెస్ట్ సిరీస్ నుంచి తప్పించాలని ఇక బీసీసీఐకి విజ్ఞప్తి చేశాడట. అందుకు మేనేజ్మెంట్ కూడా అంగీకరించడం గమనార్హం. అయితే ఈ ఏడాది ఆడిన ప్రతి సిరీస్ లో కూడా ఇషాన్ కిషన్ భారత జట్టుతోనే ఉన్నాడు అనే విషయం తెలిసిందే. అయితే తుది జట్టులో మాత్రం ఎక్కువసార్లు అతను చోటు దక్కించుకోలేకపోయాడు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి