ముంబై ఇండియన్స్ జట్టు ఈసారి కప్పు గెలుస్తుంది.. ప్రస్తుతం ఇదే విషయం గురించి తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతూ ఉంది అని చెప్పాలి. ఎందుకంటే ముంబై ఇండియన్స్ జట్టు ఇప్పుడు కొత్తగా కప్పు గెలిచిన నిరూపించుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. ఎందుకంటే మిగతా టీమ్స్ తో పోల్చి చూస్తే ఎక్కువసార్లే ఇప్పటివరకు కప్ గెలిచింది.  ఏకంగా ఐదుసార్లు ట్రోఫీ గెలిచింది అని చెప్పాలి. కానీ ఇప్పుడు ఎందుకు మళ్ళీ ముంబై ఇండియన్స్ కప్పు గెలుస్తుందా అని అందరూ ఎదురు చూస్తున్నారంటే.. కొత్త కెప్టెన్ తో బరిలోకి దిగబోతుంది.


 ముంబై ఇండియన్స్ జట్టుకు ఐదుసార్లు ఐపీఎల్ టైటిల్ అందించి ఇక మోస్ట్ సక్సెస్ఫుల్ టీం గా నిలిపిన రోహిత్ శర్మను.. ఆ జట్టు యాజమాన్యం సారధ్య బాధ్యతల నుంచి తప్పించింది. ఈ క్రమంలోనే ఇక ఎప్పుడు కొత్త కెప్టెన్ హార్దిక్ పాండ్యా సారధ్యంలో బరిలోకి దిగబోతుంది. అయితే హార్దిక్ పాండ్యాకు కెప్టెన్ గా టైటిల్ గెలవడం కూడా కొత్తేమి కాదు. ఎందుకంటే ఇప్పటికే గుజరాత్ కెప్టెన్ గా ఒక సారి ఐపీఎల్ టైటిల్ సాధించాడు. ఒకసారి జట్టును రన్నరప్ గా కూడా నిలిపాడు. ఇక ఇప్పుడు ముంబై ఇండియన్స్ సారథిగా హార్దిక్ పాండ్యా ఎలా రానిస్తాడు అన్నది ఆసక్తికరంగా మారిపోయింది.


 అయితే నేటి నుంచి ఐపీఎల్ ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో.. ఇక ఇప్పుడు ఒక సెంటిమెంట్ రిపీట్ అయితే అటు ముంబై ఇండియన్స్ ఐపీఎల్ లో కప్పు గెలుస్తుంది అంటూ కొంతమంది అభిమానులు ఒక వార్తను వైరల్ చేస్తున్నారు. ఐపీఎల్ ఓపెనింగ్ మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. అయితే ఇలా ఈ రెండు టీమ్స్ మధ్య ప్రారంభం మ్యాచ్ జరిగితే ముంబై ఇండియన్స్ ఫైనల్ లో గెలుపొందుతూ వస్తుందట. 2019 ఐపీఎల్ లో ఇదే జరిగిందని ఆర్ సి బి ఫ్యాన్స్ చెబుతున్నారు. ఇక అప్పటి మ్యాచ్లో ఆర్సిబి కేవలం 70 పరుగులు మాత్రమే చేసి ఆల్ అవుట్ అయింది అన్న విషయం తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl