అందరూ ఎదురుచూస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ మొదలైంది. దీంతో ఇండియాలో క్రికెట్ పండగ స్టార్ట్ అయింది. ఈ క్రికెట్ పండుగ ఎంజాయ్ చేసేందుకు అందరు సిద్ధమైపోతున్నారు. అయితే ఇక ఇటీవలే ప్రారంభమైన మొదటి మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య మ్యాచ్ జరిగింది అన్న విషయం తెలిసిందే. ఇక మొదటి మ్యాచ్ నరాలు తెగే ఉత్కంఠ మధ్య జరిగింది. చివరి వరకు ఎవరు విజయం సాధిస్తారు అనే విషయంపై ఒక క్లారిటీ లేకుండా పోయింది. ఇలా ఉత్కంఠ భరితంగా జరిగిన మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది.


 కొత్త కెప్టెన్ రుతురాజు గైక్వాడ్ సారథ్యంలో మొదటి విజయాన్ని సాధించింది ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ జట్టు. కాగా నిన్న జరిగిన మొదటి మ్యాచ్ ఎంతగానో ఎంజాయ్ చేసిన క్రికెట్ ప్రేక్షకులు.. ఇక నేడు జరగబోయే మ్యాచ్ ని కూడా ఎంజాయ్ చేసేందుకు రెడీ అయ్యారు. అయితే నేడు శనివారం కావడంతో ఇక డబుల్ ధమాకా ఉండబోతుంది అని చెప్పాలి. నేడు ఇక రెండు మ్యాచ్లు జరగబోతున్నాయి. దీంతో ఎంటర్టైన్మెంట్ కూడా డబల్ అవ్వబోతుంది. మధ్యాహ్నం మూడున్నర గంటలకి ఒక మ్యాచ్ జరగనుండగా.. సాయంత్రం ఏడున్నర గంటలకి మరో మ్యాచ్ జరుగుతుంది. అయితే మధ్యాహ్నం 3:30 గంటలకు జరగబోయే మ్యాచ్లో పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్ల మధ్య మ్యాచ్ జరగబోతుంది.



 చండీగఢ్ లోని ఎంవైఎస్ స్టేడియంలో ఇక ఈ మ్యాచ్ ఉండబోతుంది అని చెప్పాలి. అనంతరం కోల్కతాలోని ఈడన్ గార్డెన్స్ లో సాయంత్రం ఏడున్నర గంటలకు జరగబోయే మ్యాచ్లో కోల్కతా నైట్రేటర్స్, సన్రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య మ్యాచ్ జరగబోతుంది అని చెప్పాలి  కాగా వీకెండ్ కావడంతో ఈ రెండు మ్యాచ్లను మిస్ అవ్వకుండా చూసేందుకు క్రికెట్ ప్రేక్షకులందరూ కూడా సిద్ధమైపోయారు. అయితే ఇక ఈ మ్యాచ్లు అటు టీవీలో స్టార్ స్పోర్ట్స్ లో ప్రత్యక్ష ప్రసారం చూడవచ్చు. ఇక మొబైల్లో జియో సినిమా ఉచితంగానే లైవ్ స్ట్రీమింగ్ చేస్తూ ఉండడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl