ఐపీఎల్ 17 చాలా గ్రాండ్ గా స్టార్ట్ అయ్యింది. ఇక ఈ ఎడిషన్‌లో భాగంగా నిన్న బెంగళూరు చెన్నై మధ్య ఫస్ట్ మ్యాచ్ జరిగింది. ఆ మ్యాచ్ లో చెన్నై ఘన విజయం సాధించి బోణీ కొట్టి శుభారంభాన్ని ఇచ్చింది. ఇక ఇప్పుడు ఢిల్లీ క్యాపిటల్స్, పంజాబ్ కింగ్స్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన పంజాబ్ ముందుగా బౌలింగ్ చేయాలని నిర్ణయించుకుని ఢిల్లీ క్యాపిటల్స్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది.అయితే పంజాబ్ బౌలర్లు ఎంతో కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో మధ్య ఓవర్లలో ఢిల్లీ బ్యాటర్లు తడబాటుకు గురవ్వడం జరిగింది. అయినా కానీ తర్వాత పుంజుకున్నారు.దీంతో నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి  మొత్తం 174 పరుగులు చేసింది. కాగా రోడ్డు ప్రమాదం కారణంగా కొన్ని నెలల పాటు క్రికెట్ కు దూరంగా ఉన్న యంగ్ క్రికెటర్ రిషబ్ పంత్ రీ ఎంట్రీ మ్యాచ్ లో మాత్రం నిరాశపర్చాడు. 13 బంతుల్లో 2 ఫోర్ల సహాయంతో కేవలం 18 పరుగులు చేసి ఔటయ్యాడు. అంతకు ముందు మిచెల్‌ మార్ష్‌, డేవిడ్‌ వార్నర్‌ జోడీ అయితే శుభారంభం చేసింది.


మూడు ఓవర్లలో వీరిద్దరూ  కలిసి 39 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. కానీ నాలుగో ఓవర్‌లో మాత్రం మిచెల్ మార్ష్ వికెట్ పడింది. ఆ తర్వాత డేవిడ్ వార్నర్ ఇంకా షాయ్ హోప్ కలిశారు. వీరిద్దరూ కలిసి 33 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. అయితే ఈ జోడీని ఈజీగా బద్దలు కొట్టడంలో హర్షల్ పటేల్ సక్సెస్ అయ్యాడు. డేవిడ్ వార్నర్‌ను కూడా పెవిలియన్ కు పంపాడు. ఆ తర్వాత అందరు ఎంతగానో ఎదురు చూస్తున్న రిషబ్ పంత్ కేవలం 12 బంతులు ఎదుర్కొని 2 ఫోర్ల సాయంతో 18 పరుగులు మాత్రమే చేశాడు. కానీ ఆ తర్వాత హర్షల్ పటేల్ బౌలింగ్ లో అతను వెనుదిరిగాడు.మొదట బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ పవర్ ప్లేలో 7 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 68 పరుగులు చేసింది. పంజాబ్ కింగ్స్‌ తరఫున హర్షల్‌ పటేల్‌ మంచి బౌలింగ్‌ చేశాడు. హర్‌ప్రీత్ బ్రార్, కగిసో రబడ, అర్ష్‌దీప్ సింగ్ 1-1తో చెలరేగగా ఇంకా హర్షల్ 2 వికెట్లు తీశాడు. పంజాబ్ కింగ్స్ తరఫున హర్షల్ పటేల్ మూడు ఓవర్లు చాలా బాగా బౌలింగ్ చేశాడు. కానీ చివరి ఓవర్లో అభిషేక్ పోరెల్ పంజాబ్ బౌలర్లను ఈజీగా కడిగిపారేశాడు. లాస్ట్ ఓవర్‌లో ఏకంగా 25 పరుగులు వచ్చాయి. అభిషేక్ పోరెల్  కేవలం 10 బంతుల్లో 32 పరుగులు చేశాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: