ఎన్నో రోజులుగా భారత క్రికెట్ ప్రేక్షకులు అందరూ కూడా వేయికళ్లతో ఎదురుచూస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్రారంభమైంది. ఈ క్రమంలోనే మొదటి మ్యాచ్ నుంచి ప్రేక్షకులందరికీ కూడా మునివేల్లపై నిలబెట్టే ఉత్కంఠ మధ్య అన్ని మ్యాచ్లు జరుగుతూ ఉన్నాయి అని చెప్పాలి. నువ్వా నేనా అన్నట్లుగా సాగుతున్న మ్యాచ్ లు క్రికెట్ ప్రేక్షకులకు అసలు సిసలైన ఎంటర్టైన్మెంట్ అందిస్తూ ఉన్నాయి. అయితే ఈసారి కొన్ని టీమ్స్ కొత్త కెప్టెన్లతో బరిలోకి దిగాయి అన్న విషయం తెలిసిందే. అలాంటి వాటిలో చెన్నై సూపర్ కింగ్స్ కూడా ఒకటి.


 ఐపీఎల్ ప్రారంభమైన నాటి నుంచి కూడా చెన్నై సూపర్ కింగ్స్ కి ధోని కెప్టెన్గా కొనసాగుతూ వస్తున్నాడు. ఐదు సార్లు టైటిల్ కూడా అందించాడు. అయితే ఇక ఇప్పుడు ధోని కెరియర్ ముగింపు దశలో ఉన్న నేపథ్యంలో చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్సీ బాధ్యతలను యువ ఆటగాడు రుతురాజు గైక్వాడ్ కు అప్పగించాడు ధోని. ఈ క్రమంలోనే ధోని పక్కనే ఉండి కెప్టెన్సీ లో అతన్ని మరింత మెరుగుపరిచేందుకు ఆటగాడిగా జట్టులో కొనసాగుతూ ఉన్నాడు అని చెప్పాలి. అయితే ఇటీవల మొదటి మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుతో జరిగిన పోరులో విజయం సాధించింది చెన్నై సూపర్ కింగ్స్ జట్టు.


 అందరూ ఈ విజయం గురించే మాట్లాడుకుంటూ ఉండగా.. ఇక ఈ మ్యాచ్ గురించి మాట్లాడిన టీమిండియా మాజీ ప్లేయర్ వీరేంద్ర సెహ్వాగ్ తనదైన శైలిలో సెటైర్ వేశాడు. ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్ అనగానే అందరూ దృష్టి దోని పైన ఉంటుంది. ఈ సీజన్లో కెప్టెన్సీ నుంచి తప్పుకున్న ధోని క్రేజ్ మాత్రం తగ్గలేదు. అందుకే ఇక మొదటి మ్యాచ్ లో కెమెరామెన్ కూడా ధోనినే ఎక్కువగా చూపించాడు. రుతురాజ్ కెమెరా ఫోకస్ లో ఎక్కడా కనిపించలేదు. అయితే మ్యాచ్ చూస్తూ ఇది గమనించిన మాజీ ప్లేయర్ వీరేంద్ర సెహ్వాగ్ కెమెరామెన్ పై సెటైర్ వేశాడు. ధోనితో పాటు రుతురాజ్ ని కూడా చూపించాలని.. అతను ప్రస్తుతం చెన్నై కెప్టెన్ అంటూ గుర్తు చేశాడు వీరేందర్ సెహ్వాగ్.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl